Hyderabad: శేఖర్ బాషాను చెప్పుతో కొట్టిన లావణ్య

లావణ్య, రాజ్ తరుణ్ వివాదం రోజురోజుకూ ముదిరిపోతోంది.ఈ నేపథ్యంలో ఈ రోజు ఓ టీవీ ఛానల్ లో జరిగిన డిబేట్ లో.. ఆర్జే శేఖర్ బాషాను చెప్పుతో కొట్టింది లావణ్య. మరోవైపు ఆమె తమపై దాడి చేసిందని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చారు.

New Update
Hyderabad: శేఖర్ బాషాను చెప్పుతో కొట్టిన లావణ్య

రాజ్ తరుణ్ , లావణ్య కేసులో రోజుకో రచ్చ జరుగుతోంది. వాళ్ళిద్దరి మధ్యా వివాదం ముదిరిపోతోంది. ఈ క్రమంలో మరోవైపు రాజ్ తరుణ్‌కు మద్దతిచ్చిన వారి మీద కూడా లావణ్య దాడి చేస్తోంది. తాజాగా ఓ టీవీ లో జరిగిన డిబేట్‌లో శేఖర్ బాషాను చెప్పుతో కొట్టింది లావణ్య.

హీరో రాజ్ తరుణ్ తో గొడవ నేపథ్యంలో ఓ న్యూస్ ఛానెల్ లావణ్య, ఆర్జే శేఖర్ బాషాలతో డిబేట్ ఏర్పాటు చేసింది. అందులో శేఖర్ రాజ్ తరుణ్‌కు మద్దతుగా లావణ్య మీద ఆరోపణలు చేశాడు. ఆమె చిన్నపిల్లలకు డ్రగ్స్ అలవాటు చేసిందని అన్నాడు. దీంతో లావణ్యకు బాగా కోపం వచ్చింది. అదే కోపంతో అతనిని చెప్పుతో కొట్టింది. ఈ మొత్తం ఇన్సిడెంట్ లైవ్‌లో వచ్చింది. అంతేకాదు ఆ తర్వాత ఆ వీడియో బాగా వైరల్ కూడా అయింది.

నిన్న రాత్రి తమపై దాడికి ప్రయత్నించిందంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య మీద ఫిర్యాదు చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ తల్లి బసవరాజు రాజ్యలక్ష్మి ఈ ఫిర్యాదును చేశారు.తమ ఇద్దరికీ కూడా హెల్త్ సమస్యలు ఉన్నాయని…లావణయ వల్ల తమకు ప్రాణహాని ఉందని వారు కంప్లైంట్లో రాశారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రుల తరుఫున వారి లాయర్ ఇంద్ర గంటి మధు శర్మ తరుణ్ అడ్వకేట్ కూడ వచ్చారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు హైబీపీ ఉందని..వారికి రక్షణ కల్పించాలని అడ్వకేట్ పోలీసులను కోరారు. 

Advertisment
తాజా కథనాలు