Road Accident : అర్థరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్సీ కారుకు యాక్సిడెంట్..పీఏ మృతి..!!

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ పీఏ అక్కడిక్కడే మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది.

Road Accident : అర్థరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్సీ కారుకు యాక్సిడెంట్..పీఏ  మృతి..!!
New Update

MLC PA : ఏపీలో అర్థరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్థరాత్రి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి(MLC Parvartha Reddy Chandrasekhar Reddy) కారు ప్రమాదానికి(Road Accident) గురైంది. కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఎమ్మెల్సీ పీఏ(PA  Dead)అక్కడిక్కడే మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్ాయయి. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి స్వల్పగాయాలయ్యాయని ఆయన పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

విజయవాడ(Vijayawada) నుంచి నెల్లూరు(Nellore) కు గురువారం రాత్రి బయలుదేరారు చంద్రశేఖర్ రెడ్డి. అయితే అర్థరాత్రి ఎమ్మెల్సీ కారు వేగంగా వెళ్తున్న సమయంలో ఓ లారీ అడ్డువచ్చింది. ఈ లారీ టైర్ పంక్చర్ కావడంతో ఒక్కసారి నెమ్మదించగా వెనకా ఉన్న ఎమ్మెల్సీ కారు అదుపు తప్పి లారీ వెనకభాగాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది. దీంతో ఎమ్మెల్సీ తలకు గాయలయ్యాయి. ఆయన పీఏ అక్కడిక్కడే మరణించారు.

కాగా ప్రమాద సమయంలో ఎమ్మెల్సీ కారులో ఐదుగురు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారందర్నీ నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. వారంతా అక్కడ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డికి చికిత్స అందిస్తున్నారని..ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్ను పోలీసులు స్పాట్ కు వెళ్లారు. ఎమ్మెల్సీ పీఎ డెడ్ బాడీని పోస్టుమార్టం నిమ్మితం నెల్లూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడాచదవండి : దటీజ్ మోదీ…ప్రధాని మోదీని ప్రశంసిస్తూ చైనా మీడియా కథనాలు..!!

#mlc-parvarta-reddy-chandrasekhar-reddy #road-accidnet #andhra-pradesh-news #nellore-accident #ysr-congress-party
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe