Olympics 2024 : లక్ష్య సేన్‌ అద్భుతం.. ప్రీ క్వార్టర్స్‌కు

భారత బ్యాడ్మింటన్‌ లక్ష్య సేన్‌ పారిస్ ఒలింపిక్స్ లో జరుగుతున్న బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు. చివరి లీగ్‌ మ్యాచ్‌లో 21-18, 21-12 తేడాతో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అయిన జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు.

Olympics 2024 : లక్ష్య సేన్‌ అద్భుతం.. ప్రీ క్వార్టర్స్‌కు
New Update

Paris Olympics 2024 : భారత బ్యాడ్మింటన్‌ సూపర్‌స్టార్‌ లక్ష్య సేన్‌ (Lakshya Sen) అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థిని షాక్‌కు గురిచేశాడు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ లో జరుగుతున్న బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో లక్ష్య సేన్‌ తన మొదటి రౌండ్‌ మ్యాచ్‌లోనే భారీ సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు. చివరి లీగ్‌ మ్యాచ్‌లో 21-18, 21-12 తేడాతో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అయిన జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలిచాడు.

Also Read : 50 మీటర్ల రైఫిల్‌ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లిన స్వప్నిల్!

తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న లక్ష్యసేన్‌ చెమటోడ్చి నెగ్గాడు. ఒక దశలో 2-8తో మొదటి గేమ్‌లో వెనకబడిన అతడు.. తర్వాత పుంజుకున్నాడు. రెండో సెట్‌లో దూకుడు ప్రదర్శించి అలవోకగా విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. ఈ విజయంతో భారత బ్యాడ్మింటన్‌ (Badminton) అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. కాగా ప్రీ క్వార్ట‌ర్స్ లో హెచ్ ప్ర‌ణ‌య్‌తో సేన్ త‌ల‌ప‌డే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.





#paris-olympics-2024 #lakshya-sen
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe