నిన్న ఓ టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో కుత్భుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ (MLA Vivekanand), బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై (Srishailam Goud) దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూన శ్రీశైలం గౌడ్ ఆర్టీవీతో మాట్లాడారు. వివేకానంద్ కు అభద్రతా భావం పెరిగిపోయిందని కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. కింద ప్రజలు సమస్యలతో నిలదీయడంతో ఎమ్మెల్యే సహనం కోల్పోయాడని ధ్వజమెత్తారు. గతంలో ఆర్మూర్ ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డితో పాటు అనేక మందిపై దాడి చేసిన చరిత్ర ఎమ్మెల్యేకు ఉందన్నారు. గతంలో సమస్య పరిష్కారానికి వచ్చిన ఐటీ ఉద్యోగిని కూడా ఇంట్లోకి తీసుకెళ్లి ఎమ్మెల్యే దాడి చేశాడన్నారు.
ఇది కూడా చదవండి: Telangana Politics: ఉరికించి కొడతాం.. బీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ సీరియస్ వార్నింగ్..!
TS Politics: నేను సంయమనం పాటించింది అందుకే.. ఎమ్మెల్యే వివేకానంద చరిత్ర ఇదే: శ్రీశైలం గౌడ్ ప్రత్యేక ఇంటర్వ్యూ
బాధ్యత కలిగిన వ్యక్తిగా ఎమ్మెల్యే వివేకానంద్ తనపై దాడి చేసిన సమయంలో సంయమనం పాటించానని బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. ప్రజలు ప్రశ్నించడంతోనే ఎమ్మెల్యే ఫస్ట్రేషన్ కు గురవుతున్నాడంటూ ధ్వజమెత్తారు. ఈ సారి తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Translate this News: