/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/KTR-3-jpg.webp)
KTR: తెలంగాణ అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ వీరితో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే, సభకు 10 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వీరిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కూడా ఉన్నారు. తాజాగా తన గైర్హాజరుపై కేటీఆర్ స్పందించారు. తన తండ్రి కేసీఆర్ (KCR) అనారోగ్యం కారణంగా అసెంబ్లీకి వెళ్లలేకపోతున్నానని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ప్రమాణం చేయని మరికొందరు ఎమ్మెల్యేలతో కలిసి వేరొక రోజు ప్రమాణ స్వీకారం చేస్తామని తెలిపారు.
Unfortunately I couldn’t attend the BRS Legislature meeting today and the swearing in at the Legislative Assembly because of my father’s medical condition
Have sought another date from the Assembly Secretary for taking the oath along with 4-5 other MLAs who have also not been… https://t.co/eLjNcATZp0
— KTR (@KTRBRS) December 9, 2023
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. యశోద ఆసుపత్రిలో ఆయనకు హిప్ రీప్లేస్ మెంట్ శస్త్రచికిత్స జరిగింది. ఇదిలా ఉండగా భారత రాష్ట్ర సమితి శాసన సభాపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఉదయం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ జరిగింది.
బీఆర్ఎస్ఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు గారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కేసీఆర్ గారి పేరును ప్రతిపాదించగా మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్,… pic.twitter.com/mWCeGG2hIN
— BRS Party (@BRSparty) December 9, 2023
సీనియర్ లీడర్ కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు 37 మంది హాజరయ్యారు. శస్త్ర చికిత్స కారణంగా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గైర్హాజరయ్యారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా ఈ భేటీకి హాజరుకాలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ శాసన సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించనుంది.