Krishna Mukunda Murari: ముకుంద పై భవానికి పెరిగిపోతున్న అనుమానం.. శోభనానికి వీల్లేదని రేవతికి షాక్

కృష్ణ, మురారి, ఆదర్శ్‌, ముకుందల శోభనం ముహూర్తం గురించి రేవతి భవాని దేవిని ఆడుతుంది. దీనికి భవాని వద్దని రేవతికి షాకిస్తుంది. ఇటు ముకుంద ఆదర్శ్ ముందు ఇంకా ఎన్ని రోజులు నటించాలని టెన్షన్ పడుతుంది. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది.

Krishna Mukunda Murari: ముకుంద పై భవానికి పెరిగిపోతున్న అనుమానం.. శోభనానికి వీల్లేదని రేవతికి షాక్
New Update

Krishna Mukunda Murari:  ముకుంద మారిపోయిందని నమ్మిన ఆదర్శ్.. ఇన్నాళ్లు తనను వదిలేసి వెళ్ళిపోయినందుకు సారీ చెప్తాడు. ఇక నుంచి మనిద్దరం కలిసే ఉందామని మాటిస్తాడు ఆదర్శ్.

publive-imageపెద్ద అత్తయ్య, ఇంట్లో వాళ్ళ కోసం ఆదర్శ్ రావడానికి ఒప్పుకున్నాను. ఇప్పటికీ నేను మురారిని మర్చిపోలేక పోతున్నాను. కానీ ఆదర్శ్ రోజు రోజుకు నా పై ఆశలు పెంచుకుంటున్నాడు అని మనసులో టెన్షన్ పడుతుంది ముకుంద. ఏదో ఒకటి చేయాలనీ నిర్ణయించుకుంటుంది.

publive-imageముకుంద దగ్గరుండి కృష్ణ- మురారిలకు రింగ్స్ మార్పించడంతో సంతోషంగా ఫీల్ అవుతుంది కృష్ణ. ఇంతలో అక్కడి వచ్చిన మురారి.. ఏంటీ కృష్ణ అంత సంతోషంగా ఉన్నవని అడుగుతాడు. దీంతో కృష్ణ.. ముకుంద మీతో నా వేలికి ఉంగరం తొడిగించింది అంటే ముకుంద మారిపోయినట్లే కదా అని సంతోషిస్తారు. కానీ పెద్ద అత్తయ్యకు మాత్రం ముకుంద పై నమ్మకం రాలేదని అనుకుంటారు.

publive-image

ఒంటరిగా ఉన్న భవాని దేవి... ముకుంద నిజంగా మారిపోయిందా..? లేదా ఆదర్శ్ రింగ్ తొడగడం ఇష్టం లేక తప్పించుకోవడానికి కృష్ణ- మురారిల చేత ఉండరాలు మార్పించిందా అని ఆలోచనలో పడుతుంది. రోజు రోజుకు ముకుంద పై అనుమానం పెరుగుతుంది కానీ తగ్గండం లేదని అనుకుంటుంది.

Also Read: Brahmamudi Today Episode: అప్పలమ్మలా ఉంటావని భార్యను ఎగతాళి చేసిన రాజ్.. కొత్త అవతారంలో భర్తకు దిమ్మతిరిగే షాక్

publive-imageఇంతలో అక్కడికి వచ్చిన రేవతి కృష్ణ, మురారి, ఆదర్శ్‌, ముకుందల శోభనానికి పెట్టుడు ముహూర్తం పెట్టిస్తానని భవాని దేవిని అడుగుతుంది. ముహూర్తం పెట్టిస్తే.. మళ్ళీ ముకుందకు ఆదర్శ్ ఇష్టం లేదని తెలిస్తే కొడుకు ఏమైపోతాడో అనే భయంతో శోభనం వద్దని చెప్తుంది భవాని.

publive-imageఅక్క ఎందుకు ఇలా చేస్తుందని ఆలోచిస్తూ ఉంటుంది రేవతి. ఇంతలో అక్కడికి వచ్చిన కృష్ణ- మురారి ఏమైందని రేవతిని అడుగుతారు. భవాని అక్క శోభనానికి పెట్టుడు ముహూర్తం పెట్టిస్తానంటే వద్దని చెప్తుంది. ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదని బాధపడుతుంది రేవతి. దీంతో మనిద్దరం కలిసి వెళ్లి అడుగుదామని.. రేవతిని తీసుకొని భవాని దగ్గరకు వెళ్తుంది ముకుంద.

publive-imageఏంటీ కోడల్ని రాయబారం తీసుకొచ్చావా అని రేవతి పై కోప్పడుతుంది భవాని. కావాలంటే కృష్ణ మురారిలా శోభనం జరిపించు అని చెప్తుంది. దీంతో కృష్ణ వాళ్లకు జరిగినప్పుడే మాకు జరగాలని ఇన్ని రోజులు వాయిదా వేశాము కద అత్తయ్య అంటూ భావానిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ భవాని దేవి ఒప్పుకోదు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-imageAlso Read: Brahmamudi Today Episode: పరాయి అమ్మాయితో సంబంధం పై భర్తను నిలదీసిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు

#krishna-mukunda-murari-serial #krishna-mukunda-murari
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe