Elections: ఎన్నికల ప్రచారం చేస్తుండగా గుండెపోటు.. ఆసుపత్రిలో చేరిన నటుడు!

తమిళ నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్‌ అలీఖాన్‌ ఆసుపత్రిలో చేరారు. తమిళనాడులోని వేలూరులో ఎన్నికల ప్రచారం లో ఉన్న ఆయనకు ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో ఆయన కుప్పకూలిపోయారు.

New Update
Elections: ఎన్నికల ప్రచారం చేస్తుండగా గుండెపోటు.. ఆసుపత్రిలో చేరిన నటుడు!

Mansoor Ali Khan: తమిళ నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్‌ అలీఖాన్‌ ఈ మధ్య కాలంలో వార్తల్లో బాగా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆసుపత్రిలో చేరారు. తమిళనాడులోని వేలూరులో ఎన్నికల ప్రచారం లో ఉన్న ఆయనకు ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో ఆయన కుప్పకూలిపోయారు.

దీంతో పక్కనే ఉన్న సహాయకులు మన్సూర్‌ ని కేకే నగర్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్య సమాచారం గురించి తెలియాల్సి ఉంది. వేలూరు నియోజకవర్గం నుంచి ఆయన ఇండిపెండెంట్‌ గా లోక్‌ సభ ఎన్నికల బరిలో నిలిచారు.

Mansoor Ali Khan

‘డెమోక్రటిక్ టైగర్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో పార్టీని ఆయన ప్రారంభించారు. అయితే తన పార్టీకి ఇంకా ఎన్నికల సంఘం గుర్తింపు రాకపోవడంతో.. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఆయనకు ఛాతిలో స్వల్ప అసౌకర్యం కలిగింది. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మన్సూర్ అలీ ఖాన్.. వాటిన లెక్కచేయకుండా ప్రజల సమస్యలపై గళం విప్పుతున్నారు.

ప్రస్తుతం ఆయన సినిమాలకు విరామం ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఇక ఇటీవల హీరోయిన్ త్రిషపై మన్సూర్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. లియో మూవీలో త్రిష, మన్సూర్ నటించారు. త్రిషతో రేప్ సీన్ ఉంటుందని, ఆమెను బెడ్ రూంలోకి తీసుకెళ్లే ఛాన్స్ వస్తుందని తాను ఆశపడ్డానని మన్సూర్ అన్నారు. ఈ వ్యాఖ్యలను కోలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు.

Also Read: మంచిర్యాల మిషనరీ పాఠశాల పై దాడి .. వీడియోలు వైరల్‌!

Advertisment
తాజా కథనాలు