Kiran Royal : ముద్రగడ పరిస్థితి దారుణం.. అధికారుల తీరు మారకుంటే జరిగేది ఇదే..!

తిరుపతిలోని అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు జనసేన నాయకుడు కిరణ్ రాయల్. ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం కుమార్తే జనసేనకు మద్దతు ఇవ్వడం అభినందనీయమన్నారు. ముద్రగడకు కుటుంబ సభ్యుల మద్దతే లేదని పేర్కొన్నారు.

Kiran Royal: తిరుమలలో భక్తుల దోపిడీ.. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే జరిగేది ఇదే: కిరణ్ రాయల్
New Update

Tirupati : తిరుపతిలోని అధికారులు వైసీపీ(YCP) కి అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు  జనసేన(Janasena) నేత కిరణ్ రాయల్(Kiran Royal). ఈసీ(EC) ఆదేశాలను పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ.. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయకుంటే అధికారులు స్వతంత్రంగా పనిచేయలేరన్నారు.

Also Read:  పవన్ కళ్యాణ్ ఇందుకే పరితపిస్తున్నాడు.. సప్తగిరి సంచలన వ్యాఖ్యలు..!

తిరుపతిలో డీటీ అశోక్ రెడ్డి అనే రెవెన్యూ అధికారిని ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలని ఎన్నికల అధికారిని కోరారు. టిడిపి(TDP), జనసేన నేతలపై బైండోవర్ కేసులు పెట్టి వేదిస్తున్నారని పేర్కొన్నారు. అధికారుల తీరు మారకుంటే పెద్ద ఎత్తున నిరసన చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం కుమార్తే జనసేనకు మద్దతు ఇవ్వడం అభినందనీయమన్నారు. ముద్రగడకు కుటుంబ సభ్యుల మద్దతే లేకపోవడం దారుణమన్నారు.

#ap-election-commission #ap-ycp #janasena #kiran-royal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి