ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని భార్యా భర్తలను మోసం చేసిన కిలాడీని వికారాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ నరసింహులు అన్నారు. నిందితురాలు మంచిర్యాల జిల్లాకు చెందిన గోమాస శిరీష అలియాస్ అనూష ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పుకుంటూ, వికారాబాద్ తహసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఖాళీగా ఉందని, మౌలాలికి చెందిన దంపతులు వాణిరెడ్డి, కృష్ణారెడ్డికి మాయమాటలు చెప్పి యువతి వారి నుంచి లక్ష 50 వేలు వసూళ్లు చేసిందన్నారు. బాధితులు డబ్బులు ఇచ్చాక వారికి నకిలీ ఆర్డర్ కాపీని సైతం అందిచినట్లు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..ఉద్యోగం ఇప్పిస్తానని దంపతులను మోసం చేసిన కిలాడీ అరెస్ట్
ఉద్యోగం ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్లో తాను ఎమ్మార్వోగా ఉద్యోగం చేస్తున్నట్లు.. తమ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఖాళీగా ఉన్నట్లు మాయ మాటలు చెప్పి దంపతుల నుంచి లక్ష 50 వేల వసూళ్లు చేసిననట్లు తెలిపారు. నిందితురాలి నుంచి నగదుతో పాటు సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ నరసింహులు వెల్లడించారు. రాష్ట్రంలో నకిలీ ఉద్యోగులు పెరిగిపోతున్నారు. తాను ఈ శాఖ, ఆ శాఖలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పుకుంటూ తమకు ఇంత ఇస్తే తాము ఉద్యోగం ఇప్పిస్తామని అమాయకుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. అలాంటి ఘటనే వికారాబాద్లో జరిగింది
Translate this News: