Allu Arjun: వయనాడ్‌ బాధితులకు అల్లు అర్జున్ సాయం.. రూ. 25 లక్షల విరాళం

కేరళ రాష్ట్రం వయనాడ్‌ విపత్తు యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ విపత్తులో నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి పలువురు సినీ తారలు ముందుకొస్తున్నారు. తాజాగా తెలుగు హీరో అల్లు అర్జున్ తన వంతు సాయంగా రూ.25 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా అందించారు.

Allu Arjun: వయనాడ్‌ బాధితులకు అల్లు అర్జున్ సాయం.. రూ. 25 లక్షల విరాళం
New Update

Allu Arjun: కేరళ రాష్ట్రం వయనాడ్‌ ప్రకృతి విపత్తు యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మొప్పడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో వందల సంఖ్యల్లో ప్రజలు గాయాలపాలయ్యారు. కూలిపోయిన భవనాలు శిథిలాల కింద ప్రాణాలతో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉంది ప్రభుత్వం.

వయనాడ్ బాధితులకు అల్లు అర్జున్ సహాయం

ఈ విపత్తులో నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పలువురు సినీ తారలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ కు చెందిన ప్రముఖ నటీనటులు తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయక నిధికి విరాళాలు అందించారు. అయితే ఈ విపత్తు సమయంలో టాలీవుడ్ సెలెబ్రెటీలు ఎవరూ స్పందించకపోవడంతో పలు విమర్శలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ తన వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు తన వంతు సహాయాన్ని అందించారు. రూ. 25 లక్షలు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. టాలీవుడ్ నుంచి స్పందించిన మొదటి హీరో అల్లు అర్జున్ కావడంతో ఆయన పై ఫ్యాన్స్ ప్రసంశలు కురిపిస్తున్నారు.

Also Read: Nayanthara : వయనాడ్ విపత్తుకు నయనతార, విఘ్నేశ్ దంపతుల భారీ విరాళం.! - Rtvlive.com

#allu-arjun #wayanad-landslides
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe