Kerala : బాలకృష్ణ, రాందేవ్‌బాబాలకు కేరళ కోర్టు నోటీసులు

పతంజలి ప్రకటనలతో తప్పుదోవ పట్టించారంటూ కేరళ కోర్టు కూడా రాందేవ్‌బాబా, బాలకృష్ణలకు నోటీసులు పంపిచింది. జూలై 6న హాజరుకావాలని ఇద్దరికీ న్యాయస్థానం సమన్లు​జారీ చేసింది.

New Update
Kerala : బాలకృష్ణ, రాందేవ్‌బాబాలకు కేరళ కోర్టు నోటీసులు

Patanjali Ads  Issue : రాందేవ్ బాబా (Ramdev Baba), బాలకృష్ణ (Balakrishna) లకు వరుసపెట్టి దెబ్బలు తగులుతున్నాయి. ఇంతకు ముందే పతంజలి యాడ్స్ (Patanjali Ads) మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పతంజలి ఆయుర్వేదం ద్వారా తప్పుదోవ పట్టించే ప్రకటనలపై సుప్రీంకోర్టు రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణలకు కూడా సమన్లు ​జారీ చేసింది. వెంటనే యాడ్స్ ఆపేయాలని ఆదేశించింది.ఇప్పుడు కేరళలోని కోజికోడ్‌లోని జ్యుడషియల్ మెజిస్ట్రేట్ కోర్టు కూడా వారికి నోటీసులు జారీ చేసింది. జూలై 6న హాజరుకావాలని ఇద్దరికీ న్యాయస్థానం సమన్లు​జారీ చేసింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చారంటూ పలువురు బాబా రామ్‌దేవ్, బాలకృష్ణలపై పిటిషన్లు వేశారు. ఇందులో భాగంగానే ధర్మాసనం నోటీసులు ఇచ్చింది.

Also Read:Andhra Pradesh: ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం వద్దు-మంత్రి లోకేష్

Advertisment
తాజా కథనాలు