KCR: మనకు గిదో లెక్కనా.. దొంగల్లో కలిసెటోళ్ల గురించి బాధలేదు!

పార్టీని వీడి దొంగల్లో కలిసెటోళ్ల గురించి బాధలేదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా. పార్టీ కార్యకర్తలు భరోసాగా ఉండండి. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామంటూ పార్టీ శ్రేణులకు భరోసానిచ్చారు.

New Update
KCR: మనకు గిదో లెక్కనా.. దొంగల్లో కలిసెటోళ్ల గురించి బాధలేదు!

BRS: పార్టీ వీడుతున్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడి దొంగల్లో కలిసెటోళ్ల గురించి బాధలేదన్నారు. తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా. పార్టీ కార్యకర్తలు భరోసాగా ఉండండి. పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్పా.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు. నాడైనా నెడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే. మెరికల్లాంటి యువ నాయకులను లీడర్లను తయారుచేస్తుంది. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామంటూ పార్టీ శ్రేణులకు కేసీఆర్ భరోసానిచ్చారు.

ఈ మేరకు బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగట్లేదు. కేసీఆర్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. నాయకులు కండువాలు మారుస్తూనే ఉన్నారు.ఇప్పటికే పలువుకు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ఇటీవల మాజీ మంత్రి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. 

Also Read: తెలంగాణకు రెండో రాజధానిగా ట్రై సిటీ.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!

Advertisment
తాజా కథనాలు