Bengalore: ఆరేళ్లలో ఏడు పెళ్లిళ్లు..కోర్టు ఏం చెప్పిందంటే!

కర్నాటకకు చెందిన ఓ మహిళ ఆరేళ్లలో ఏకంగా ఆరుగురు భర్తలను మార్చింది. ఇటీవల ఏడో పెళ్లి కూడా చేసుకుంది. అంతటితో ఆగకుండా ఏడో భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. డబ్బుల కోసమే ఆమె ఇలా చేస్తోందని ఏడో భర్త కోర్టుకు తెలిపాడు. దీంతో కోర్టు ఆ మహిళను మందలించింది.

Karthika masam: ఎంత ట్రై చేసినా పెళ్లి కావడం లేదా..అయితే కార్తీక మాసం లో ఇలా చేయండి మరీ!
New Update

Karnataka: తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కర్ణాటక లో ఓ మహిళ (32) కోర్టును ఆశ్రయించింది. అయితే న్యాయస్థానం ఆమె మీదే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే  ఆ మహిళ కేవలం డబ్బు కోసమే శ్రీమంతులను చూసి పెళ్లి చేసుకోవడం..తరువాత ఏదోక సాకు చెప్పి విడాకులు తీసుకుటుండడంతో సదరు మహిళ బాధితుడైన ఏడో భర్త న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

దీంతో ఆ మహిళ బాగోతం బయటకు వచ్చింది. ఇలా ఆరు సంవత్సరాలలో ఆరుగురు భర్తలను మార్చిన ఆమె..వివాహం అయిన ఆరు నెలల తరువాత భర్త..అత్తింటి తరుఫున వారు వేధిస్తున్నారంటూ వారి మీద గృహహింస కేసులు పెట్టేది. దీంతో సదరు భర్తల కుటుంబాల వారు రాజీకి వచ్చి పెద్ద మొత్తంలో నగదు ఇచ్చి ఆమెను వదిలించుకునేవారు.

ఇలా తాజాగా ఆ మహిళ ఏడో భర్త పై కేసు పెట్టింది. దీంతో కోర్టు ఆ మహిళ తీరును న్యాయమూర్తి సోమవారం ఖండించారు. ఆరుగురు భర్తల్లో ఒక్కరితో కూడా ఎక్కువ రోజులు ఉండకపోవడం అంటే మహిళ తప్పే కనిపిస్తోందని ఆమెకు మొట్టికాయలు వేసింది. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేశారు.

Also read: అమెరికా మహిళను అడవిలో గొలుసుతో కట్టేసి..!

#mariieges #karnataka #bengalore #court
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe