ఇకపై కేసీఆర్ కి శాశ్వతంగా రెస్ట్ దొరుకుతుంది: డీకే శివకుమార్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఫామ్ హౌస్ లో కెసిఆర్ రెస్ట్ తీసుకుంటున్నాడని అయితే, ఇకపై శాశ్వతంగా ఆయనకు రెస్ట్ దొరుకుతుందని కౌంటర్లు వేశారు.

New Update
ఇకపై కేసీఆర్ కి శాశ్వతంగా రెస్ట్ దొరుకుతుంది: డీకే శివకుమార్

Karnataka Deputy CM DK Shiva kumar: తెలంగాణ ఎలక్షన్ క్యాంపెన్లో పాల్గొనున్నారు కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఈరోజు ఎలక్షన్ క్యాంప్ నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్పు కోరుకొంటున్నారని వ్యాఖ్యనించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఫామ్ హౌస్ లో కెసిఆర్ రెస్ట్ తీసుకుంటున్నాడని అయితే, ఫ్యూచర్లో అదే పనిలో ఉంటాడని కౌంటర్ వేశారు. ఇకపై  శాశ్వతంగా కేసీఆర్ కి రెస్ట్ దొరుకుతుందని అన్నారు. కెసిఆర్ కూడా ఫామ్ హౌస్ లో ఉండేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యనించారు.

Also Read:కేసీఆర్ చెప్పిందే నిజం..వీడియో షేర్ చేసిన కన్నా లక్ష్మీనారాయణ

ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా బెంగళూరు వైపే చూస్తున్నారని అన్నారు కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు బెంగళూరులో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిరోజు కాంగ్రెస్ ను, నన్ను గుర్తు చేసుకోనిదే నిద్ర పోదని సెటైర్ వేశారు. బెంగుళూరులో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిని నిలబెట్టుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు. 9వ తేదీన క్యాబినెట్లో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి హామీలపై దృష్టి పెడతామని తెలిపారు. సీఎం పదవి కోసం కర్ణాటకలో కొట్లాటలు ఏమి లేవని ఉంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఉండాలి అని కామెంట్స్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు