ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండి సంజయ్ (Bandi Sanjay) ఓటమి పాలైన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో కేవలం 3 వేల ఓట్ల తేడాతోనే ఆయన ఓడి పోయారు. గత ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా ఓటమి తర్వాత ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు బండి సంజయ్. దీంతో ఈ సారి కూడా బండి సంజయ్ మళ్లీ ఎంపీగా బరిలోకి దిగుతారన్న ప్రచారం సాగుతోంది. అయితే.. జిల్లాలోని కొందరు సీనియర్లు మాత్రం ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తుండడం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా కరీంనగర్ కు చెందిన సీనియర్లు సమావేశమైనట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: TSPSC: టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ గా ఆ మాజీ ఐఏఎస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం?
Bandi Sanjay: కరీంనగర్ లో బండి సంజయ్ కు సీనియర్ల షాక్.. ఎంపీ టికెట్ ఇవ్వొద్దని డిమాండ్?
ఎమ్మెల్యేగా ఓటమి పాలవడంతో ఎంపీగా పోటీకి సిద్ధం అవుతున్న బండి సంజయ్ కు సొంత జిల్లాలోని సీనియర్లు షాక్ ఇచ్చారు. ఇటీవల సమావేశమైన సీనియర్లు బండికి ఎంపీ టికెట్ ఇవ్వకుండా.. మరో సీనియర్ నేతకు ఇచ్చేలా హైకమాండ్ ను కోరాలని చర్చించిచనట్లు సమాచారం.
Translate this News: