Kangana Ranaut Ayodhya: వాహ్..చీరకట్టి..కళ్లకు అద్దాలుపెట్టి..ఆలయంలో చీపురుపట్టి..కంగనా పోస్ట్ వైరల్..!!

అయోధ్య రాముని ప్రాణప్రతిష్ట కోసం బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అయోధ్యకు చేరుకున్నారు. కాంజీవరం చీరకట్టి, బంగారు నగలు ధరించి, కళ్లకు అద్దాలు పెట్టి హనుమంతుడి ఆలయాన్ని శుభ్రం చేసింది. వచ్చేయ్ రామా వచ్చేయ్ అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

Kangana Ranaut Ayodhya: వాహ్..చీరకట్టి..కళ్లకు అద్దాలుపెట్టి..ఆలయంలో చీపురుపట్టి..కంగనా పోస్ట్ వైరల్..!!
New Update

Kangana Ranaut Ayodhya:యావత్ ప్రపంచ ఎదురుచూస్తున్న ఘడియ మరికొన్ని గంటల్లో రానుంది. సోమవారం అయోధ్యలోని రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ వేడుక కోసం యావత్ ప్రపంచం కనులారా చూసేందుకు ఉవ్విళూరుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి రమ్మంటూ ఆహ్వానాలు అందాయి. అందులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana Ranaut) కూడా ఆహ్వానం అందింది. ఇక రేపే ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఉండటంతో కంగనా ఈరోజే అయోధ్యకు చేరుకుంది. కాంజీవరం చీరకట్టుకుని...బంగారు నగలు ధరించి..కళ్లకు అద్దాలు పెట్టుకుని అయోధ్యలోని హనుమన్ ఆలయాన్ని(Hanuman temple) దర్శించుకుంది.

అంతేకాదు గుడి ప్రాంగణాన్ని చీపురుపట్టి శుభ్రం చేసింది. తర్వాత అక్కడ ఉండే ఆధ్యాత్మిక గురువు శ్రీ రామభద్రాచార్యను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుంది కంగనా. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. రామా..ఇక వచ్చేయ్..ఈరోజు నేను ఒక గొప్ప వ్యక్తి శ్రీరామభద్రాచార్యులవారిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.

publive-image

ఆయన ఆధ్వర్యంలో హనుమాన్ యాగం చేశాను..అయోధ్యధామంలో రామునికి స్వాగతం పలుకుతున్నందుకు జనమంతా ఆనందంతో ఉప్పొంగుతున్నారని పోస్టు చేసింది.

publive-image

ఇది కూడా చదవండి:  ఇస్రో అయోధ్య శాటిలైట్ ఫొటో ఎంత అద్భుతంగా ఉందో..!!

#kangana-ranaut #ayodhya-dham #ayodhya #viral-post
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe