AP: వీడిన సచివాలయ ఉద్యోగి మిస్సింగ్ మిస్టరీ.. ఇష్టంలేని పెళ్లి ఫిక్స్‌ చేయడంతో..

కాకినాడ జిల్లా ముసలయ్యపేట సచివాలయ ఉద్యోగి మిస్సింగ్ మిస్టరీ విషాదంగా మారింది. కుంభాభిషేకం రేవు దగ్గర లలిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అమరవిల్లిలో నివాసముంటున్న లలితకు 20 రోజుల కిందట నిశ్చితార్థం జరిగింది. ఇష్టంలేని పెళ్లి ఫిక్స్‌ చేయడం వల్లే లలిత వెళ్లిపోయినట్లు సమాచారం.

New Update
AP:  వీడిన సచివాలయ ఉద్యోగి మిస్సింగ్ మిస్టరీ.. ఇష్టంలేని పెళ్లి ఫిక్స్‌ చేయడంతో..

Kakinada: సచివాలయ ఉద్యోగి (Secretariat Employee) మిస్సింగ్ మిస్టరీ విషాదంగా మారింది. కుంభాభిషేకం రేవు దగ్గర లలిత మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. కాకినాడ జిల్లా ముసలయ్యపేట సచివాలయంలో వాకా లలిత (Vaka Lalitha) ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా పని చేస్తుంది. అయితే, మూడ్రోజుల నుంచి లలిత కనిపించకుండా పోయింది.

చివరిగా, సెల్ ఫోన్ నుండి తన అన్నయ్యకు మెసేజ్ చేసింది ఆ యువతి. 'అన్నయ్య నేను చనిపోతున్నా' అంటే మెసేజ్ పంపింది. వెంటనే ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్, సీసీ ఫుటేజీ ఆధారంగా యువతి కోసం పోలీసులు దర్యాప్తు చేశారు. చివరికి కుంభాభిషేకం రేవు దగ్గర యువతి మృతదేహాన్ని గుర్తించారు.

Also Read: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త.. జోన్నలు, సజ్జలు, రాగులతో పాటు..

కాగా, ఉప్పాడ మండలం అమరవిల్లిలో నివాసముంటున్న యువతి లలితకు 20 రోజుల కిందట పెద్దలు నిశ్చితార్థం చేశారు. అయితే, ఆ యువతికి ఈ పెళ్లి ఇష్టం లేనట్లు తెలుస్తుంది. ఇష్టంలేని పెళ్లి ఫిక్స్‌ చేయడం వల్లే లలిత వెళ్లిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు