Reasi Terror Attack : రియాసి ఉగ్రదాడి.. ఇతన్ని పట్టిస్తే రూ.20 లక్షల రివార్డ్

New Update
Reasi Terror Attack : రియాసి ఉగ్రదాడి.. ఇతన్ని పట్టిస్తే రూ.20 లక్షల రివార్డ్

Reasi Terror Attack : రియాసి జిల్లా (Reasi District) లో ప్రయాణీకుల బస్సుపై జరిగిన ఉగ్రదాడి (Terror Attack) లో తొమ్మిది మంది మరణించగా.. 41 మంది గాయపడ్డారు. దాడి జరిగిన రెండు రోజుల తర్వాత, జమ్మూ కాశ్మీర్ పోలీసులు (Jammu & Kashmir Police) ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాది యొక్క స్కెచ్‌ను విడుదల చేశారు. అతన్ని పట్టించినవారికి రూ.20 లక్షల రివార్డ్ ప్రకటించారు.

సమాచారం ఇవ్వడానికి..

* SSP Reasi - 9205571332
* ASP Reasi - 9419113159
* DySP HQ Reasi - 9419133499SHO
* Pouni - 7051003214
* SHO Ransoo- 7051003213
* PCR Reasi- 9622856

ఆదివారం, శివ ఖోరీ ఆలయం నుండి కత్రాలోని మాతా వైష్ణో దేవి మందిరానికి యాత్రికులు ప్రయాణిస్తున్న 53 సీట్ల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. పోని ప్రాంతంలోని తేర్యాత్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), రాజస్థాన్, ఢిల్లీ నుండి యాత్రికులతో బయలుదేరిన బస్సు తుపాకీ కాల్పులతో రియాసి జిల్లాలో లోతైన లోయలోకి దూసుకెళ్లింది .

Advertisment
తాజా కథనాలు