బీజేపీ మాజీ ఎమ్మెల్యేను ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఇటీవల గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. అందుకే తాను గోషామహల్లో పర్యటించినట్లు ఈటల రాజేందర్ తెలిపారు. నియోజకవర్గంలో బీజేపీ నాయకులపై, కార్పోరేట్పై తప్పుడు కేసులు పెడుతూ బీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈటల మండిపడ్డారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశంతో బీజేపీ నాయకులను బలవంతంగా బీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని, తాము రామంటే ఉన్న కేసులను తిరిగి తోడుతామని బెదిరిస్తున్నారని రాజాసింగ్ అన్నట్లు ఎమ్మెల్యే ఈటల తెలిపారు. తాము ఇలాంటి బెదిరింపులకు బయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నాయకులపట్ల కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Etela Rajender Meets Rajasingh : రాజాసింగ్తో ఈటల భేటీ..
బీజేపీ మాజీ ఎమ్మెల్యేను ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఇటీవల గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. అందుకే తాను గోషామహల్లో పర్యటించినట్లు ఈటల రాజేందర్ తెలిపారు. నియోజకవర్గంలో బీజేపీ నాయకులపై, కార్పోరేట్పై తప్పుడు కేసులు పెడుతూ బీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈటల మండిపడ్డారు.
Translate this News: