Breaking News: పాతబస్తీలో ఐటీ దాడులు..బడా వ్యాపారులే టార్గెట్‌!

పాతబస్తీలోని ప్రముఖ వ్యాపారుల ఇళ్లలో ఉదయం నుంచి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఓ రాజకీయ పార్టీకి భారీగా డబ్బులు సమకూరుస్తున్నారనే సమాచారంతో ఈ దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Breaking News: పాతబస్తీలో ఐటీ దాడులు..బడా వ్యాపారులే టార్గెట్‌!
New Update

షానవాజ్‌ ఇంటితో పాటు పలువురి ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. కోహినూర్‌ , కింగ్స్‌ గ్రూపుల పేరుతో హోటళ్లలో ఫంక్షన్లు నిర్వహిస్తున్న వీరు ఓ రాజకీయ పార్టీకి భారీగా నగదు సమకూర్చుతున్నట్లు సమాచారం రావడంతోనే ఐటీ అధికారులు ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ ఏడాది మే నెలలో కూడా పాతబస్తీ తో పాటు దాని చుట్టుపక్కల 30 ప్రాంతాల్లో ఉన్న కోహినూర్‌ గ్రూప్‌ నకు చెందిన అన్ని కార్యాలయాల్లో తనిఖీలు చేశారు.

Also read: హీరోగా ఎంట్రీ ఇస్తున్న విజయ్‌ సేతుపతి కుమారుడు!

#it-attack #old-city #hyderabad
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe