Andhra Pradesh: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీలు...

రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా ఉన్న అంజనా సిన్హా కు ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు ఇస్తూ ఏపీ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమెతో పాటూ మరికొంతమంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తున్నట్టు ఆదేశించింది.

New Update
Andhra Pradesh: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీలు...

IPS Officers Transfer: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐసీఎస్‌లను బదిలీ చేస్తున్నట్టు ప్రకటించింది అక్కడి గవర్నమెంట్. ఇందులో భాగంగా రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా ఉన్న అంజనా సిన్హా కు ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు ఇస్తూ ఏపీ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. మాదిరెడ్డి ప్రతాప్ ను ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్ డి జీగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు లా అండ్ ఆర్డర్ ఐజీ గా సీహెచ్ శ్రీకాంత్..విజయవాడ నగర్ పోలీస్ కమిషనర్ గా sv రాజశేఖర్ బాబులను నియమించారు. ఇక పీహెచ్డీ రామకృష్ణ ను డీజీపీ కార్యాలయం ప్రోవిజన్ అండ్ లాజిస్టిక్స్ ఐజీ గా, విశాఖపట్నం రేంజ్ డీఐజీగా గా గోపీనాథ్ జెట్టి..విశాల్ గున్ని ని డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విజయరావుని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించారు. అలాగే కోయ ప్రవీణ్ ని కర్నూలు రేంజ్ ఐజిగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

publive-image

Also Read:National: నీతి అయోగ్ అధికారులు, ఆర్ధిక వేత్తలతో ప్రధాని మోదీ భేటీ

Advertisment
తాజా కథనాలు