ఐపీఎల్(IPL)లో ఈ ఏడాది అన్నిటికంటే ఎక్కువగా తమ అభిమానులను నిరాశ పరిచిన జట్టు సన్రైజర్స్ హైదరాబాద్. నిజానికి ఈ ఏడాదే కాదు.. కొన్నేళ్లుగా ప్రతీ ఏడాది సన్రైజర్స్ తమ ఫ్యాన్స్ను బాధపెడుతూనే ఉంది. అప్పుడెప్పుడో 2018లో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో ఫైనల్కి వచ్చారు. తర్వాత వారి ఆట తీసికట్టుగా మారంది. వార్నర్ను ఎందుకు వదులుకున్నారో తెలియదు. ఇలా సన్రైజర్స్ మేనేజ్మెంట్పై అభిమానులు ఫైర్ అవుతూ ఉంటారు. ఈ ఏడాది పాయింట్ల పట్టికలో సన్రైజర్స్(Sun Risers Hyderabad) లాస్ట్ ప్లేస్లో నిలిచింది. ఈ ఏడాది 14 మ్యాచ్ల్లో కేవలం నాలుగు మ్యాచ్లే గెలిచింది హైదరాబాద్. 8 పాయింట్లలో మైనస్ 0.580 రన్రేట్తో లాస్ట్ ప్లేస్లో నిలిచింది. దీంతో వచ్చే ఏడాది జట్టులో భారీ మార్పులు చేసేందుకు యాజమాన్యం ప్లాస్ చేస్తోంది.
పూర్తిగా చదవండి..SRH: దండం సామి.. మీ ముగ్గురు ఇక దయచేయండి.. రూ.31 కోట్లు సేవ్ చేసుకునే ప్లాన్లో సన్రైజర్స్!
వచ్చే నెలలో ఐపీఎల్ మినీ వేలం ఉండగా.. ప్లేయర్ల రిటెన్షన్ గడువు నవంబర్ 26తో ముగియనుంది. ఈ ఏడాది ఐపీఎల్లో ఘోరంగా ఫెయిల్ అయిన హ్యారీ బ్రూక్ (రూ 13.25 కోట్లు), మయాంక్ (రూ.8.5 కోట్లు) వాషింగ్టన్ సుందర్(రూ.8.75 కోట్లు)ను సన్రైజర్స్ వదిలేసే ఛాన్స్ ఉంది.
Translate this News: