Crime News : మద్యం మత్తులో కారుతో యువతి బీభత్సం.. ఇద్దరికి తీవ్ర గాయాలు..! విశాఖలో మద్యం మత్తులో ఓ యువతి కారుతో బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వెళ్తూ రెండు బైకులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఆ యువతి.. చిన్నచిన్న గాయాలతో బయటపడింది. By Jyoshna Sappogula 27 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Visakha : విశాఖలో మద్యం మత్తు(Alcohol Intoxication) లో ఓ యువతి కారుతో బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో మద్యం మత్తులో కారు(Car Accident) లో వెళ్తూ రెండు బైకులను ఢీ కొట్టింది. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో సెంటర్ రోడ్ పై నుంచి డివైడర్ డికొట్టడంతో ఇద్దరు ద్విచక్ర వాహనదారులకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అత్యవసర చికిత్స కోసం వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. Also Read: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. సాయంత్రం 5 గంటల వరకే ఆ ఛాన్స్! యువతి బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థిని(B.Tech 3rd Year Student) గా గుర్తించారు. బ్లాక్ కలర్ వోక్స్వాగన్ వెంటో కార్ ఎయిర్ బాగ్స్ ఓపెన్ కావడంతో విద్యార్థిని చిన్నచిన్న గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఆరిలోవ ట్రాఫిక్ పోలీసులు(Traffic Police). పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. #car-accident #b-tech-student #visakhapatnam #alcohol-intoxication మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి