/rtv/media/media_files/2025/02/06/kc0CgOMBAd9o7oW5fpJO.jpg)
Sheikh Hasina
బంగ్లా వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసంపై దాడికి దిగి నిప్పు పెట్టారు దుండగులు. ఆన్లైన్లో మాజీ ప్రధాని హసీనా ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వారు భవనాన్ని కూల్చివేయవచ్చు.. కానీ చరిత్రను కాదని, చరిత్ర తన ప్రతీకారం తీర్చుకుంటుందని కూడా వారు గుర్తుంచుకోవాలంటూ ఈ ఘటనపై హసీనా తీవ్రంగా స్పందించింది.
బంగ్లాదేశ్లో తనకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం నిజానికి తనను హత్య చేయడానికే అని షేక్ హసీనా ఆరోపించారు. మహ్మద్ యూనుస్ ప్రభుత్వం తనను, తన సోదరిని చంపాలని ప్లాన్ చేసిందంటూ కామెంట్స్ చేశారు. తన ప్రసంగంలో హసీనా తన నివాసంపై జరిగిన దాడి గురించి పలు ప్రశ్నలు లేవనెత్తారు. తన ఇంటికి ఎందుకు నిప్పంటించారని అడిగారు. తాను బంగ్లాదేశ్ ప్రజల నుండి న్యాయం కోరుతున్నానని.. తాను నా దేశానికి ఏమీ చేయలేదా? మరి ఇంత అవమానం ఎందుకు? అని ఆమె నిలదీశారు.
మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తన ప్రసంగంలో లక్షలాది మంది అమరవీరుల ప్రాణాలను పణంగా పెట్టి మనం సాధించిన జాతీయ జెండాను, రాజ్యాంగాన్ని, స్వేచ్ఛను బుల్డోజర్తో కూల్చివేసి నాశనం చేసే శక్తి వారికి ఇంకా లేదని అన్నారు. వాళ్ళు ఇంటిని కూల్చగలరు, కానీ చరిత్రను కాదు. చరిత్ర తన ప్రతీకారం తీర్చుకుంటుందని వారు గుర్తుంచుకోవాలి. బుల్డోజర్ తో చరిత్రను తుడిచివేయలేదంటూ హసీనా వ్యాఖ్యనించారు.
భారీగా ఆస్తి నష్టం
బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పార్టీని దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరనసలు చేపట్టారు. ఈ క్రమంలో ముజిబుర్ రెహమాన్ ఇంటికి నిప్పు అటింంచారు. ఇంట్లోకి బలవంతంగా చొచ్చుకెళ్లిన నిరసనకారులు ఇంటిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా భారత్లో తలదాచుకుంటున్న షేక్ హసీనాను తిరిగి స్వదేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది.
Also Read : Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు.. మస్తాన్ మాములోడు కాదయ్యా!