/rtv/media/media_files/2025/09/26/netanyahu-2025-09-26-22-41-45.jpg)
ఐక్యరాజ్య సమిత సర్వసభ్య సమావేశాలు న్యూ యార్క్ లో జరుగుతున్నాయి. వీటిల్లో ఈరోజు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రసంగించారు. అయితే ఆయన మాట్లాడుతుండగా అనుకోని అవమానం ఎదురైంది. ప్రసంగం జరుగుతుండగానే చాలా దేశాలకు చెందిన ప్రతినిధులు వాకౌట్ చేశారు. నెతన్యాహు ప్రసంగాన్ని నిరసించారు. దీంతో సమావేశం హాలు కాళీగా కనిపించింది. అయితే మరోవైపు అమెరికాతో సహా పలు దేశాల ప్రతినిధులు మాత్రం నెతన్యాహుకు మద్దతుగా నిలబడ్డారు. ఆయన ప్రసంగానికి చప్పట్లు కొడుతూ మద్దతు పలికారు.
BREAKING: UN delegates from multiple nations walk out of Israeli Prime Minister Benjamin Netanyahu's General Assembly address pic.twitter.com/G6GMwqCspN
— Fox News (@FoxNews) September 26, 2025
గాజా ఆపరేషన్ ను పూర్తి చేస్తాం..
ఐరాసలో కూడా నెతన్యాహు హమాస్ పాటే పాడారు. దానిని తుడిచిపెట్టే వరకూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. గాజాలో ఆపరేషన్ ను పూర్తి చేస్తామని చెప్పారు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించే విషయమై మాట్లాడుతూ...అది మంచి నిర్ణయం కాదని అన్నారు. యూదులు, అమాయక ప్రజలపై ఉగ్రవాదానని ప్రోత్సహించడమే అవుతుందని చెప్పారు. ఇందులో పాశ్చాత్య దేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనక్కు తగ్గదని స్పష్టం చేశారు. ది కర్స్.. పేరుతో రూపొందించిన మ్యాప్ ను చూపిస్తూ నెతన్యాహు మాట్లాడారు. పశ్చిమాసియాలో మార్పులు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని అన్నారు. మరోవైపు నెతన్యాహు ప్రసంగాన్ని గాజాలో పౌరులకు లౌడ్ స్పీకర్లు పెట్టి మరీ వినిపించారు.
VIDEO | Representatives from several countries walk out as Israeli PM Benjamin Netanyahu begins his speech at the UNGA.
— Press Trust of India (@PTI_News) September 26, 2025
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/XTcKr2qC7n