భారత్- పాక్ మధ్య యుద్ధ సైరన్ మోగింది. ఏ క్షణమైనా పాకిస్తాన్పై భారత్ దాడి చేయవచ్చు. పాకిస్తాన్లో యుద్ధ సైరన్లు మోగుతున్నాయి. 29 నగరాల్లో యుద్ధ సైరన్లు ఏర్పాటు చేసింది పాక్ ప్రభుత్వం. సైరన్లు మోగిస్తూ జనాల్ని అప్రమత్తం చేస్తుంది. భారత్ నుంచి వైమానిక దాడులు జరిగితే..జనం ఎలా ప్రాణాలు కాపాడుకోవాలని సూచనలు చేస్తోంది. భారత్ నుంచి క్షిపణి దాడులు ఉంటాయన్న సమాచారంతో ముందుగానే జనాల్ని అలర్ట్ చేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. సైరన్ హెచ్చరిక రాగానే బయటకు వెళ్లకుండా పిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా వారికి సూచించింది. ఇప్పటికే పాక్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ పాకిస్తాన్ భారత్ పై ఎటువంటి తీవ్రతను ప్రారంభించదని, అయితే రెచ్చగొడితే మాత్రం బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.
War siren Installation in #Pakistan
— Sumit Chaudhary (@SumitDefence) May 1, 2025
Pakistan instal siren in #Khyber Pakhtunkhwa. siren system has been completed in the Rescue 1122 building in Bajaur pic.twitter.com/8wJ6GbFgOO