Indian Nurse Nirmisha Priya: "నిమిషా ప్రియా విడుదల అవుతుంది".. కె.ఏ. పాల్ సంచలన వీడియో!

యెమెన్‌లో భారత నర్సు నిమిషా ప్రియాకు విధించిన మరణ శిక్ష రద్దయిందని డా. కే.ఏ. పాల్ తెలిపారు. యెమెన్, భారత నాయకుల నిరంతర శ్రమతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఆమెను ఇండియాకు సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నారు.

New Update
Indian Nurse Nirmisha Priya

Indian Nurse Nirmisha Priya

Indian Nurse Nirmisha Priya: భారత నర్సు నిమిషా ప్రియాకు విధించిన మరణ శిక్షను(Death Sentence) రద్దు చేశారు. ఈ విజయానికి యెమెన్(Yemen), భారత నాయకుల నిరంతర కృషి కారణమని గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు డా. కే.ఏ. పాల్(Dr. K.A. Paul) మంగళవారం రాత్రి యెమెన్ రాజధాని సనా నుండి వీడియో ద్వారా ప్రకటించారు. 

డా. కే.ఏ. పాల్ వీడియోలో మాట్లాడుతూ...

"ఇది ఆ దేవుని ఆశీర్వాదం వల్ల సాధ్యమైంది". పది రోజులుగా రాత్రింబవళ్ళూ శ్రమించిన యెమెన్ నాయకులకు, భారత అధికారులు అద్భుతమైన సహకారం అందించినందుకు, ధన్యవాదాలు తెలిపారు. నిమిషా ప్రియాను సురక్షితంగా ఇండియాకు తరలించే లాజిస్టిక్ ఏర్పాట్లకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

ఈ కేసులో భారత ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రంధీర్ జైస్వాల్ ప్రకారం, యెమెన్‌లో న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కొనేందుకు ఒక న్యాయవాదిని ఏర్పాటు చేయడమేకాక, ఆమె కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. షరియా చట్టాల ప్రకారం క్షమాభిక్ష లేదా పరిహారం (Diya) ద్వారా పరిష్కారం చూపే మార్గాలను కూడా పరిశీలిస్తున్నారు.

Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

అదే సమయంలో, భారత గ్రాండ్ ముఫ్తీ ఖాంతాపురం ఏపీ అబూబక్కర్ ముస్లియార్ యెమెన్ మత పండితులతో చర్చలు జరిపారు. మానవతా దృష్టితో, ఆమెను మతాధారంగా కాకుండా, ఒక మానవురాలిగా చూసి క్షమించమని అభ్యర్థించారు. ఆయన చర్చల తరువాతే నిమిషా ప్రియాకు విధించిన మరణ శిక్షను తాత్కాలికంగా నిలిపివేశారన్న వార్తలు వచ్చాయని ఆయన తెలిపారు.

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

ఇదే విషయంపై గత వారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం స్పందిస్తూ, నిమిషా ప్రియా శిక్షను వాయిదా వేయడం ఊరట కలిగించిందని వ్యాఖ్యానించారు. యెమెన్‌లోని సంబంధిత వ్యక్తులతో, భారత అధికారుల తోడ్పాటుతో, ఆమె విడుదల దిశగా సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే

నర్సు నిమిషా ప్రియాపై విధించిన మరణ శిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయడం వెనుక భారతీయ అధికారులు, మత నాయకులు, డా. కే.ఏ. పాల్  చేసిన అసాధారణ ప్రయత్నాల ఫలితంగా అనుకోవచ్చు. ఆమెకు న్యాయం జరగాలని దేశం మొత్తం కోరుతోంది.

Advertisment
తాజా కథనాలు