ఆక్సియం -4 మిషన్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఈ మిషన్కు పైలట్గా ఉన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజులు యాత్ర కోసం మధ్యహ్నం 12 గంటలకు పాల్కన్ 9 రాకెట్ బయలుదేరింది.
We have LIFTOFF of Axiom Mission 4!
— NASA's Kennedy Space Center (@NASAKennedy) June 25, 2025
The #Ax4 mission lifted off from Launch Complex 39A at 2:31am ET June 25, taking four private astronauts to the @Space_Station for a mission of up to 14 days. pic.twitter.com/lhRkWUwAGk
ఎవరీ శుభాంశు శుక్లా..?
అమెరికా ఫ్లోరిడాలోని లాంచ్ స్టేషన్ నుంచి ఫాల్కన్ 9 బయల్దేరింది. శుభాంశు తోపాటు మరో ముగ్గురు 14 రోజుల పాటు అంతరిక్షంలో ఉండనున్నారు. అతను ఇండియన్ నేవీలో గ్రూప్ కెప్టెన్గా పనిచేస్తున్నారు. గతంలో గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా స్పేస్లోకి వెళ్లారు. ఇండియన్ ఆస్ట్రోనాట్ శుక్లా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జన్మించారు. 2005లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2019లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ లో ఆస్ట్రోనాట్గా ఎంపికైయ్యాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మిగ్, సుఖోయ్ యుద్ద విమానాలు నడిపిన అనుభవం కూడా అతనికి ఉంది. రష్యా యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందాడు. ప్రస్తుతం ఆక్సియం మిషన్ -4లో స్పేస్ పైలట్గా కొనసాగుతున్నాడు. రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లనున్న రెండో ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా. అలాగే ISSకు వెళ్లిన మొదటి భారతీయ హ్యోమగామి కూడా అతనే.
ఈ మిషన్ కోసం ఇండియా రూ.550 కోట్లు ఖర్చు చేసింది. రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ ఇండియన్ ఆస్ట్రోనాట్. 29 గంటల్లో ఫాల్కన్ 9 రాకెట్ ISS కి చేరుకుంటుంది.