Israel: మరోసారి విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌..19 మంది పాలస్తీనియన్లు మృతి!

గాజాలోని జబాలియా ప్రాంతంలోని శరణార్థి శిబిరం పై ఇజ్రాయెల్‌ వైమానికి దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.

iran warns israel
New Update

ఇజ్రాయెల్‌ -హమాస్‌ ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌ వరుస దాడులు పాలస్తీనా పౌరుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తాజాగా గాజాలోని జబాలియా ప్రాంతంలోని శరణార్థి శిబిరం పై ఇజ్రాయెల్‌ వైమానికి దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.

ఇక ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో వేలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గత వారం రోజులుగా జబాలియా ప్రాంతంలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడుల్లో 150 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ దాడుదల నేపథ్యంలో నివాసితులు ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు వెళ్లకుండా గాజాలోని హమాస్‌ అంతర్గత మంత్రిత్వశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

సురక్షితమనుకున్న ప్రాంతాల్లోనే దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్‌ సైన్యం తమ పౌర ప్రాంతాలను స్థావరాలుగా ఉపయోగించడాన్ని హమాస్‌ ఖండించింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 42 వేల పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

Also Read :   ఆ కేసు సీఐడీకి.. వైసీపీకి చంద్రబాబు సర్కార్ మరో షాక్!

#israel-attack #gaza
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe