/rtv/media/media_files/2025/09/29/world-tallest-bridge-2025-09-29-13-37-24.jpg)
ప్రపంచంలోనే ఇంజినీరింగ్ అద్భుతాలకు చిరునామాగా నిలుస్తున్న చైనా మరో చారిత్రక నిర్మాణాన్ని పూర్తి చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జిను చైనా ప్రారంభించింది. ఈ వంతెన నిర్మాణంతో ఇక్కడి ప్రయాణికులకు రెండు గంటల సమయం ఆదా అవుతోంది. గతంలో చుట్టూ తిరిగి వెళ్లడానికి పట్టే రెండు గంటల సమయం పట్టేది. ఇప్పుడు కేవలం రెండు నిమిషాల్లో బ్రిడ్జ్ దాటిపోతున్నారు.
From 2 hours to 2 minutes
— Good View Hunting (@SceneryCHN) September 28, 2025
China's Huajiang Grand Canyon Bridge🌉—1,420m span, 625m high—has opened to traffic, setting new world records in engineering.#Guizhou#EngineeringMarvelpic.twitter.com/bWzsQyF0fp
చైనాలోని గుయిజౌ ప్రావిన్స్లోని లోతైన గ్రాండ్ కాన్యన్ లోయపై ఈ వంతెనను నిర్మించారు. నది గర్భం నుంచి ఈ వంతెన దాదాపు 625 మీటర్లు (2,051 అడుగులు)ఎత్తులో ఉంది. ఇది పారిస్లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ కంటే కూడా దాదాపు 30 మీటర్లు ఎక్కువ. ఈ వంతెన పొడవు 2,900 మీటర్లు.
ముఖ్యంగా పర్వత ప్రాంతంలో ఇంత పెద్ద విస్తీర్ణం కలిగిన వంతెనను నిర్మించడం కష్టమైన పని. 2022లో ప్రారంభమైన ఈ నిర్మాణం దాదాపు రూ. 2,400 కోట్ల ఖర్చుతో పూర్తి అయింది. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 22,000 మెట్రిక్ టన్నుల ఉక్కును ఉపయోగించారు. ఇది మూడు ఈఫిల్ టవర్ల బరువుతో సమానం.