/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/EARTHQUAKE-jpg.webp)
Earth Quake
ఈ మధ్యకాలంలో ఆగ్నేయాసియా దేశాల ప్రజలను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. అయితే తాజాగాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాా తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.8గా భూకంప తీవ్రత నమోదైంది. భూకంపానికి రాజధాని తైపీలో భవనాలు అన్ని కదిలాయి. 73 కి.మీ లోతులో భూమి కంపించిందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
Breaking🚨: A 5.8 magnitude earthquake shakes northeastern #Taiwan, triggering safety protocols but causing no major damage. Stay informed and safe! 📢 🚇 #氣象署 #蘇澳鎮 #地震 #earthquake ★ https://t.co/4RHnE2thdb ★ pic.twitter.com/PTzYPBVKBr
— TVBS World Taiwan (@tvbsworldtaiwan) April 9, 2025
ఇది కూడా చూడండి: Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక
ఇండోనేషియాలో ఇటీవల..
ఇటీవల మయన్మార్,చైనా, ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారు జామున పశ్చిమ ఆషే ప్రావిన్స్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 5.9 తీవ్రవతో భూప్రకంపనలు వచ్చినట్లు ఆ దేశ జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది. సిమెయులు రీజెన్సీలోని సినాబాంగ్ నగరానికి ఆగ్నేయంగా 62 కి.మీ దూరం, సముద్ర మట్టానికి 30 కి.మీ లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..
అర్థరాత్రి సమయంలో ప్రజలు గాఢ నిద్రలో ఉండగా.. ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే మొదట ఈ భూకంపం 6.2 తీవ్రతతో నమోదైంది. ఆ తర్వాత 5.9గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చూడండి: Instagram: ఇన్స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు