అమెరికాలో భారతీయ యువకుడికి 35 ఏళ్ల జైలు శిక్ష

మైనర్లను నమ్మించి లైంగికంగా లోబరుచుకున్నందుకు అమెరికా కోర్టు ఓ భారతీయ యువకుడికి 35 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 31 ఏళ్ల వయస్సు ఉన్న ఈ యువకుడు తక్కువ వయస్సు అని చెప్పి మైనర్లను లైంగికంగా వేధించాడు. పోలీసుల దర్యాప్తులో దోషిగా తేలడంతో జైలు శిక్ష విధించింది.

New Update
Child Abuse

Child Abuse Photograph: (Child Abuse)

మైనర్లను నమ్మించి లైంగికంగా లోబరుచుకోవడంతో ఓ భారతీయ యువకుడికి అమెరికా 35 ఏళ్లు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. ఓక్లహామా రాష్ట్రం ఎడ్మండ్‌ నగరంలో సాయికుమార్‌ కుర్రేముల ఉంటున్నాడు. సోషల్ మీడియా ద్వారా చిన్నారులతో పరిచయం పెంచుకునేవాడు. 

ఇది కూడా చూడండి:Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

ఇది కూడా చూడండి:Crime News: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!

మైనర్ అమ్మాయిలనే టార్గెట్ చేసి..

తన వయస్సు కూడా తక్కువేనని మాయ మాటలు చెప్పి లైంగికంగా లోబర్చుకునేవాడు. ఆ తర్వాత చెప్పినట్లు చేయకపోతే ఫొటోలు, వీడియోలు బయట పెడతానని బెదిరించేవాడు. అయితే గతేడాది ఈ యువకుడిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టగా ఒక 20 మంది మైనర్ అమ్మాయిలను బెదిరించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో డిస్ట్రిక్ట్‌ కోర్టు ఆ యువకుడికి 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ఇది కూడా చూడండి:Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!

ఇదిలా ఉండగా ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యాపిల్లలతో రక్సెల్ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ వెళ్తున్నాడు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు అర్థరాత్రి 2 గంటలకు పెద్ద కూతురు (12) వాష్‌రూమ్‌కి వెళ్లింది. ఆ సమయంలో ఆమె వెనుక వెళ్లిన ఓ వ్యక్తి ఒక అరగంట పాటు ఆమెను బంధించి వేధించాడు. వాటిని మొబైల్ ఫోన్‌లో కూడా చిత్రీకరించాడు. అతను వదిలిపెట్టిన తర్వాత ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు రైల్వే టోల్‌ఫ్రీ నంబరు 139కి ఫోన్‌ చేసి కంప్లైట్ చేశారు. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.  

Advertisment
తాజా కథనాలు