/rtv/media/media_files/2025/12/18/latest-telugu-news-2025-12-18-12-12-54.jpg)
పొరుగు దేశం పాకిస్థాన్కు అఫ్ఘానిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. రెండు దేశాల మధ్య ప్రవహించే కునార్ నదిపై భారీ డ్యామ్ల నిర్మాణానికి తాలిబన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంజాదా పచ్చజెండా ఊపారు. ఈ నిర్ణయం పాకిస్థాన్ను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది, ఎందుకంటే ఈ ప్రాజెక్టు పూర్తయితే పాక్ భూభాగంలోకి వచ్చే నీటి ప్రవాహం భారీగా తగ్గే అవకాశం ఉంది.
⚡افغانستان کے لیے بڑی خبر
— Daily Kabul News (@KaDailyNews) December 17, 2025
ایک اور قدم اگے، طالبان کنڑ (Kunar) دریا کے پانی کا ایک حصہ ملک کے اندر دارونٹا ڈیم کی طرف موڑ رہے ہیں۔ اس اقدام سے افغانستان کی زراعت پر نمایاں اور مثبت اثرات مرتب ہونے کی توقع ہے۔ pic.twitter.com/enGxtqud5O
నీటిని ఆయుధంగా మారుస్తున్న తాలిబన్లు?
గత కొంతకాలంగా పాకిస్థాన్, అఫ్ఘానిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతిచర్యగా, తాలిబన్ ప్రభుత్వం ఈ 'వాటర్ వార్' మొదలుపెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అఫ్ఘానిస్తాన్కు తన సహజ వనరులను వాడుకునే పూర్తి హక్కు ఉందని, తమ దేశ పునర్నిర్మాణం కోసం ఈ డ్యామ్లు నిర్మిస్తున్నామని తాలిబన్ మంత్రి అబ్దుల్ లతీఫ్ మన్సూర్ స్పష్టం చేశారు.
కునార్ నది పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతానికి ప్రధాన నీటి వనరు. డ్యామ్ నిర్మాణం వల్ల అక్కడి వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇస్లామాబాద్ వాదిస్తోంది. ఈ వివాదంలో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే, అఫ్ఘానిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ పరోక్షంగా సమర్థించడం. తమ దేశ ప్రయోజనాల కోసం నీటి వనరులను వాడుకునే హక్కు అఫ్ఘానిస్తాన్కు ఉందని భారత్ అభిప్రాయపడింది. ఇప్పటికే సింధు నది జలాల ఒప్పందం విషయంలో భారత్ కఠినంగా వ్యవహరిస్తుండగా, ఇప్పుడు అఫ్ఘానిస్తాన్ కూడా అదే బాటలో పయనించడం పాకిస్థాన్కు రెండు వైపుల నుంచి ఇబ్బందిగా మారింది.
పాక్కు ఆర్థిక, ఆహార సంక్షోభం
పాకిస్థాన్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కునార్ నదిపై డ్యామ్ నిర్మాణం జరిగితే.. వ్యవసాయం దెబ్బతింటుంది. పంజాబ్, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతాల్లో పంట దిగుబడి తగ్గి ఆహార కొరత ఏర్పడవచ్చు. సరిహద్దు వివాదాలతో ఇప్పటికే వర్తక వాణిజ్యాలు దెబ్బతిన్నాయి, ఇప్పుడు నీటి గొడవలు తోడైతే సంబంధాలు మరింత క్షీణిస్తాయి. తాలిబన్లు, పాకిస్థాన్ మధ్య అధికారికంగా ఎటువంటి నీటి ఒప్పందాలు లేవు. ఈ నేపథ్యంలో తాలిబన్ ప్రభుత్వం పనులను వేగవంతం చేయాలని ఆదేశించడంతో, రాబోయే రోజుల్లో ఈ 'జల వివాదం' అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కానుంది.
Follow Us