బ్రహ్మోస్ పేరు చెబితే చాలు... శత్రు దేశాల వెన్నులో వణుకు పుడుతుంది. ఆపరేషన్ సిందూర్తో భారత్ దెబ్బ ఏంటో ప్రపంచానికి తెలిసివచ్చింది. ఎంతలా అంటే..ఇండియా.. తన గడ్డమీద నుంచి పాక్లో అడుగు పెట్టకుండా యుద్దం చేసింది. సరిహద్దులు దాటాల్సిన అవసరం లేకుండానే.. క్షిపణులతో విజయవంతంగా దాడులు చేసింది. పహల్గామ్లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. దాడికి తెగబడటంతో.. ఆ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ చనిపోవడంతో.. అందుకు ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం.. ఆపరేషన్ సిందూర్ నిర్వహించి వందలాది ఉగ్రమూకలను మట్టుబెట్టింది. అయితే ఈ ఆపరేషన్లో బ్రహ్మోస్ కీ రోల్ పోషించింది. అంతటి శక్తివంతమైన ఈ వెపన్ని భారత్ ఎందుకు అమ్మడం లేదు.. ఎందుకు అమ్మ లేదో తెలుసుకుంది.
15 బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించి
రష్యా, అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ లాంటి దేశాల నుంచి భారత్ ఆయుధాలు కొంటోంది. తద్వారా ఆ దేశాలు చాలా లాభపడుతున్నాయి. వేలు, లక్షల కోట్ల బిజినెస్ వాటికి జరుగుతోంది. అదే విధంగా ఇండియా కూడా.. చిన్న చిన్న ఆయుధాల్ని కొన్ని విదేశాలకు అమ్మగలుగుతోంది. ఐతే.. ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య తర్వాత, అనేక దేశాలు భారతదేశం నుంచి క్షిపణులను కొనడానికి ఆసక్తి చూపాయి. అయితే, భారత్ మాత్రం విదేశాలకు క్షిపణులను అమ్మలేని పరిస్థితి ఉంది. పహల్గామ్ దాడి తర్వాత... భారత్, పాకిస్థాన్ భూభాగంలోకి 15 బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించి, ఆకస్మిక దాడులు చేసింది. భారత్ విజయంలో బ్రహ్మోస్ క్షిపణులు కీలక పాత్ర పోషించాయి. ఇవి శత్రుదేశమైన పాకిస్థాన్ వెన్ను విరిచాయి. అక్కడి పాలకులకు బ్రహ్మోస్ భయంకర అస్త్రంలా కనిపించింది. సూపర్సోనిక్ బ్రహ్మోస్ క్షిపణి పరిధి 290 కిలోమీటర్లు కాగా... దాని అధునాతన వెర్షన్ పరిధి 500 నుండి 800 కిలోమీటర్లు ఉంటుంది. ఈ క్షిపణి 200 నుండి 300 కిలోల అధిక పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు.
ఆ తరువాత, అనేక దేశాలు భారత్ నుంచి... బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపాయి. ఇవి టార్గెట్లను విజయవంతంగా ఛేదిస్తున్నాయి. భారీ పేలుడు సృష్టించి.. తీవ్రమైన నష్టం కలిగించి, శత్రువులు షాక్ అయ్యేలా చేస్తున్నాయి. అందుకే ప్రపంచ దేశాలకు ఈ క్షిపణులు బాగా నచ్చుతున్నాయి. థాయిలాండ్, సింగపూర్, బ్రూనై, బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనిజులా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్ దేశాలు భారతదేశం నుంచి బ్రహ్మోస్ క్షిపణులు కొనడానికి ఆసక్తి చూపాయి. ప్రపంచ దేశాలు బ్రహ్మోస్ కోసం క్యూ కడుతుంటే...భారత్ ప్రస్తుతానికి బ్రహ్మోస్ క్షిపణులను అమ్మట్లేదు. ఎందుకంటే బ్రహ్మోస్ అనేది భారతదేశం, రష్యా కలిసి అభివృద్ధి చేసిన క్షిపణి. ఈ క్షిపణి పేరులోని బ్రహ్మ అనేది బ్రహ్మపుత్రానదికి గుర్తు... అలాగే రష్యాలోని మోస్క్వా నదికి గుర్తుగా... బ్రహ్మోస్ అని పేరు పెట్టారు.భారతదేశం, రష్యా కలిసి బ్రహ్మోస్ క్షిపణిని అభివృద్ధి చేస్తున్నాయి. అందులో ప్రతీ దేశం 50 శాతం వాటాను కలిగి ఉన్నాయి. భారతదేశం ఈ క్షిపణిని అమ్మాలనుకుంటే, దానికి రష్యా అనుమతి అవసరం.
విదేశాలు ఆసక్తి చూపిస్తున్నా... ఈ క్షిపణులను భారీ మొత్తం చెల్లించి కొనడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, భారతదేశం బ్రహ్మోస్ క్షిపణులను విక్రయించదు. ఐతే.. రష్యా ముందుకొచ్చి.. వాటిని అమ్మేందుకు సిద్ధపడితే.. రెండు దేశాల మధ్యా డీల్ కుదిరితే.. అప్పుడు ఈ అమ్మకాలు జరిపే అవకాశం ఉంటుంది. ఐతే.. ప్రతీ అమ్మకమూ రష్యాకి చెప్పి చెయ్యాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఈ యుద్ధం తర్వాత.. భారత క్షిపణులకు ప్రపంచ దేశాల్లో విపరీతంగా నమ్మకం, డిమాండ్ పెరిగిందనే చెప్పుకోవచ్చు.