Ram charan: చెర్రీ మూవీలో హైబ్రిడ్‌ పిల్ల..ఇది నిజమేనా?

ఉప్పెన ఫేం బుచ్చిబాబు రామ్‌ చరణ్‌ తో ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు సమాచారం.

New Update
Ram charan: చెర్రీ మూవీలో హైబ్రిడ్‌ పిల్ల..ఇది నిజమేనా?

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డైరెక్టర్‌ శంకర్‌ భారతీయుడు 2 సినిమా తీస్తున్న కారణంగా చరణ్‌ సినిమా విడుదల ఆలస్యం అవుతుంది. దీంతో చరణ్‌ సినిమా వేసవి కాలంలో విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

శంకర్‌ సినిమా తరువాత చరన్‌ ఉప్పెన ఫేం బుచ్చిబాబుతో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో హీరోయిన్‌ గా సీతారామం కథానాయిక మృణాళ్‌ పేరు వినిపించగా..ఆ తరువాత జాన్వి కపూర్ పేరు తెరమీదకొచ్చింది. ఇప్పుడు వీళ్లిద్దరిని కాదు అంటూ సాయి పల్లవి పేరు కొత్తగా వార్తల్లోకి వచ్చింది.

చరణ్‌, సాయి పల్లవి కాంబోలో సినిమా వస్తే కనుక రికార్డులు బద్దలు కావడం ఖాయమని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రూరల్‌ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్‌ డ్రామా అని తెలుస్తుంది. ఈ సినిమాకి సాయి పల్లవి కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలోనే సినిమా చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

ఈ సినిమాలో విజయసేతుపతి కీలక భూమిక పోషిస్తున్నారు. మైత్రీమూవీమేకర్స్‌ సమర్పణలో వెంకట సతీష్‌ కిలారు వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బానర్లపై నిర్మించనున్న ఈ చిత్రానికి ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీత దర్శకుడు.

చరణ్‌, సాయి పల్లవి డ్యాన్స్‌లతో థియేటర్లు దద్దరిల్లిపోతాయని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కాగా ఈ మూవీ కోసం సాయి పల్లవి దాదాపు నాలుగు కోట్లు పారితోషకం తీసుకుంటుంది అన్న విషయం తెలిసిందే.

Also read: కార్తీక మాసంలో కచ్చితంగా దానం చేయాల్సినవి ఏంటి..వాటి వల్ల ఫలితాలేంటి!

Advertisment
తాజా కథనాలు