Indira Shoban: అడ్డగోలు అప్పులు, అసమర్థత, అణిచివేతలతో కూడిన పరిపాలన చేసిన కేసీఆర్, పదేండ్లు అధికారంలో ఉండి ప్రజలను ఒక్కనాడు కూడా కలవలేదు. ప్రజలు విసిగిపోయి అధికారం నుంచి దింపేస్తే, ఇప్పుడు గడీల నుంచి బయటకొచ్చి దొంగ ఏడుపు ఏడుస్తూ రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన దొంగ ఏడుపును నమ్మి ప్రజలు మళ్లీ ఆయనకు ఓట్లేస్తారని భ్రమపడుతున్నాడు. తెలంగాణ ప్రజలను తక్కువగా అంచనా వేస్తూ, వారిని మరోసారి మోసపుచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్కు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
పూర్తిగా చదవండి..TS: అడ్డగోలు అప్పులు.. దొంగ ఏడుపులు.. కేసీఆర్కు బుద్ధి చెప్పాల్సిందే: ఇందిరాశోభన్
పదేళ్ల కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాశోభన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడ్డగోలు అప్పులు, అసమర్థత, అణిచివేతలు తట్టుకోలేక ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. ఇప్పడు ఎంపీ సీట్లకోసం దొంగ ఏడుపులతో ప్రజలను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారంటూ దుయ్యబట్టారు.
Translate this News: