America: అగ్ర రాజ్యంలో మరో భారతీయ విద్యార్థి మృతి..రెండునెలల్లో ఐదో ఘటన!

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు. పర్డ్యూ యూనివర్శిటీలో డాక్టరల్ అభ్యర్థి సమీర్ కామత్(23) సోమవారం సాయంత్రం ప్రకృతి రిజర్వ్‌లో చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

America: అగ్ర రాజ్యంలో మరో భారతీయ విద్యార్థి మృతి..రెండునెలల్లో ఐదో ఘటన!
New Update

America: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి (Indian Student) శవమై కనిపించాడు. ఈ ఏడాది లో ఇది ఐదో ఘటన(Fifth Incident) . ఇండియానా (Indiana) లోని పర్డ్యూ యూనివర్శిటీలో డాక్టరల్ అభ్యర్థి సమీర్ కామత్(Sameer Khamath) (23) సోమవారం సాయంత్రం ప్రకృతి రిజర్వ్‌లో చనిపోయినట్లు వారెన్ కౌంటీ కరోనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

సమీర్‌ గతేడాది ఆగస్టులో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి యూఎస్‌ పౌరసత్వాన్ని కూడా పొందాడు. వచ్చే ఏడాది సమీర్‌ తన డాక్టరల్‌ ప్రోగ్రామ్‌ ను పూర్తి చేసేవాడు. అయితే ఇప్పటి వరకు సమీర్‌ చనిపోవడానికి గల కారణాలను పోలీసులు తెలపలేదు. పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ శవపరీక్ష నిర్వహించి, నివేదికను త్వరలో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న మరో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి నీల్ ఆచార్య చనిపోయిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది. అతని తల్లి మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో క్యాంపస్ మైదానంలో అతని మృతదేహం లభ్యమైంది.అతని తల్లి గౌరీ అతనిని కనుగొనడానికి సోషల్ మీడియాలో సహాయం కోరింది, నీల్‌ను క్యాంపస్‌లో డ్రాప్ చేసిన ఉబెర్ డ్రైవర్ చివరిగా చూశాడని వెల్లడించింది.

గత వారం, 19 ఏళ్ల శ్రేయాస్ రెడ్డి ఓహియోలో శవమై కనిపించాడు. జార్జియాలోని లిథోనియాలో MBA చదువుతున్న వివేక్ సైనీ జనవరి 16న నిరాశ్రయులైన వ్యక్తి దాడి చేయడంతో మరణించాడు. ఆ వ్యక్తికి ఉచితంగా ఆహారం ఇవ్వడానికి నిరాకరించడంతో సైనీపై దాడి జరిగింది. ఫాల్క్‌నర్ విద్యార్థిని 50 సార్లు కొట్టాడని, ఇది సైనీ మరణానికి దారితీసిందని అధికారులు పేర్కొన్నారు.

ఈ వరుస సంఘటనలు యునైటెడ్ స్టేట్స్‌లో 300,000 కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థి సంఘం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చెబుతున్నాయి.

Also read: ప్లాస్టిక్‌ నోట్ల గురించి పార్లమెంట్‌ లో చర్చ..కేంద్ర మంత్రి ఏమన్నారంటే!

#america #sameer #student #dead
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe