రింకూ సింగ్(Rinku Singh).. ఈ ఏడాది ఐపీఎల్లో కొత్త సంచలనం. ఓవర్లో 28 పరుగులు కావాలంటే వరుసగా ఐదు సిక్సులు కొట్టిన రింకూ సింగ్ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. ఓడిపోయిందనుకున్న మ్యాచ్ను గెలిపించి ఔరా అనిపించాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ఆడే రింకు ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా లైమ్ లైట్లోకి వచ్చాడు. ఐపీఎల్లో మంచి ఫినీషర్గా పేరు తెచ్చుకున్న రింకూ విశాఖ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్లో అదరగొట్టాడు. చివరి బంతికి ఒక్క పరుగు అవసరం కావాల్సి ఉండగా.. సిక్సర్ బాదాడు. అయితే అది నో బాల్ కావడంతో.. కావాల్సింది ఒక్క పరుగే కావడంతో నో బాల్ని కౌంట్కి ఒక పరుగు టీమ్ స్కోరులో యాడ్ అవుతుంది. దీంతో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గరే ఇండియా విన్ ఐనట్లు లెక్క. దీంతో రింకూ కొట్టిన సిక్సర్ అతని ఖాతాలో పడలేదు.
పూర్తిగా చదవండి..Rinku Singh: టీమిండియాకు మరో ధోనీ దొరికేశాడు.. కొత్త ఫినీషర్ వచ్చేశాడోచ్..!
విశాఖ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన టీ20 ఫైట్లో లాస్ట్ బాల్ హీరోగా నిలిచిన రింకూ సింగ్ను మరో ధోనీ అంటూ ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. వన్డేల్లో టీమిండియాకు ధోనీ ఎంత మంచి ఫినీషింగ్ ఇచ్చాడో టీ20ల్లో రింకూ సింగ్ అలాంటి ఫినీషర్గా రోల్ ప్లే చేయనున్నాడని జోస్యం చెబుతున్నారు.
Translate this News: