Crime: భార్యను బండరాయితో కొట్టి చంపిన భర్త.. పసి బిడ్డను చూడకుండా దారుణం!

మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. భార్య కవిత అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో అర్థరాత్రి నిద్రలో ఉన్నప్పుడు ఆమెను బండరాయితో కొట్టిచంపాడు అమృత్‌సాహు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

New Update
Crime: భార్యను బండరాయితో కొట్టి చంపిన భర్త.. పసి బిడ్డను చూడకుండా దారుణం!

Mailardevpally - Husband Killed His Wife: మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఇల్లాలిని దారుణంగా హతమార్చాడు. ఆమె గాఢనిద్రలో ఉన్నపుడు క్రూరమృగంలా విరుచుకుపడ్డాడు. భార్య మొఖంపై బండరాయితో దాడి చేసి చంపేశాడు. తీవ్ర గాయలైన ఆమె రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వొదిలింది. ఈ భయంకరమైన సంఘటన స్థానికులను భయాందోళనకు గురిచేయగా ఇందుకు సబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

చంపేస్తా చంపేస్తా అంటూ..
ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత్‌సాహు, కవిత (Kavitha) అనే దంపతులకు రెండేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఒక పాప ఉంది. అయితే మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో ఓ అపార్టుమెంట్ లో కూలీ పనులు చేసుకుంటున్న దంపతులు అక్కడే ఒక గుడిసే నిర్మించుకుని ఉంటున్నారు. కొంతకాలంగా సాఫిగా సాగిన వారి సంసారంలో అనుమానం మొదలైంది. కవిత మరొక పురుషుడితో సన్నిహితంగా ఉంటుందనే కోపంతో రగిలిపోతున్న అమృత్ (Amruth) ఆదివారం పొద్దటి నుంచి ఆమెతో గొడవపడ్డాడు. పదే పదే చంపేస్తా చంపేస్తా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. చివరికీ సాయంత్రం బయటకు వెళ్లి మద్యం తాగివచ్చిన అమృత్.. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆమె తలపై బండారాయితో కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి : TS Mega DSC: డీఎస్సీ ప్రశ్నా పత్రాల తయారీలో కీలక మార్పులు.. పాస్ వర్డ్స్ తో సహా..

కళ్లతో చూసి తట్టుకోలేకపోయా..
ఇక ఈ దారుణాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తన పాపను తీసుకుని పోలీస్ స్టేషన్ వెళ్లిన అమృత్.. భార్య కవిత మరొకరితో సన్నిహితంగా ఉన్నప్పుడు చూసి తట్టుకోలేక ఇలా చేశానని చెబుతున్నాడు. కళ్లతో చూసి తట్టుకోలేకనే చంపేశానంటున్నాడు. తన మొదటి భార్య ఇలాగే మోసం చేస్తే వదిలేశానని, ఇప్పుడు రెండో భార్య సైతం అదే పాడు పనిచేస్తుంటే చూస్తూ ఉండలేక దారుణానికిపాల్పడ్డట్లు చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. పాపను వారి బంధువులకు అప్పగిస్తామన్నారు.

Advertisment
తాజా కథనాలు