సచిన్.. సచిన్.. సచిన్.. టీమిండియా క్రికెట్ అభిమానుల స్లోగన్ అది. 24ఏళ్ల పాటు టీమిండియాకు ఆడిన సచిన్ ప్రపంచంలో ఏ గ్రౌండ్లో అడుగుపెట్టినా ఫ్యాన్స్ సచిన్..సచిన్ నినాదాలు చేయకుండా ఉండరు. ఇక పాకిస్థాన్పై మ్యాచ్ అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది సచినే. ఇప్పటివరకు భారత్-పాక్ జట్లు ప్రపంచ కప్లో ఏడు సార్లు తలపడగా.. అందులో మూడు సార్లు సచిన్కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించిందటే ఆ జట్టుపై క్రికెట్ గాడ్ డామినేషన్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ వరల్డ్కప్లో భాగంగా ఇండియా పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్లోనూ సచిన్ అలరించాడు. గ్రౌండ్లో నుంచి కాదు కానీ కామెంటరీ బాక్స్ నుంచి. తన చిరకాల ప్రత్యర్థి వకర్తో కలిసి ముచ్చటించాడు. రవిశాస్త్రి అడుగుతున్న ప్రశ్నలకు తనదైన శైలీలో సమాధానాలు చెప్పాడు సచిన్.
ఆ రోజును మర్చిపోగలమా బాసూ
IND vs PAK: సచిన్.. సచిన్..! టీమిండియా అభిమానుల కళ్లలో కన్నీళ్లు..ఆ రోజును మర్చిపోగలమా బాసూ!
అహ్మదాబాద్లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగుతోండగా క్రికెట్ గాడ్ సచిన్ కామెంటరీ బాక్స్లో అలరించాడు. సచిన్ కామెంటరీ చేస్తుంటే అహ్మదాబాద్ బిగ్ స్క్రీన్పై 2003 వరల్డ్కప్లో సచిన్ ఆడిన ఇన్నింగ్స్ని డిస్ప్లే చేశారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా సచిన్..సచిన్ అంటూ నినాదాలు చేసి పాత రోజులను గుర్తు చేసుకున్నారు.
Translate this News: