క్రికెట్ అభిమానులకు మంచి మజాను పంచింది సెమీస్ మ్యాచ్. కివీస్, టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించింది. సెమీస్లో న్యూజిలాండ్పై గెలుపుతో రోహిత్ సేన ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక నవంబర్ 16న ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ రెండో సెమీస్ జరగనుండగా.. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుతో ఇండియా తలపడనుంది. నవంబర్ 19(ఆదివారం) అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గెలుపుతో 2019 వరల్డ్ కప్ సెమీస్లో ఎదురైన పరాభవానికి టీమిండియా బదులు తీర్చుకుంది. 2019 ప్రపంచకప్ సెమీస్లో న్యూజిలాండ్ చేతిలోనే ఇండియా ఓడిపోయిన విషయం తెలిసింది. స్టార్ పేసర్ షమీ మరోసారి భారత్ను గెలిపించాడు. బంతితో నిప్పులు చెరిగాడు. ఏడు వికెట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో ప్రపంచ కప్ హిస్టరీలో నాలుగో సారి ఫైనల్ కు చేరిన జట్టుగా ఇండియా నిలిచింది.
పూర్తిగా చదవండి..IND VS NZ: చెల్లుకు చెల్లు.. దెబ్బకు దెబ్బ.. ఫైనల్కి దూసుకెళ్లిన టీమిండియా!
వరల్డ్కప్లో టీమిండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. వాంఖడే వేదికగా జరిగిన సెమీ ఫైనల్ ఫైట్లో కివీస్ను ఓడించింది. 7 వికెట్లతో భారత్ విజయంలో పేసర్ షమీ కీ రోల్ ప్లే చేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది.
Translate this News: