తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఖండించారు. తాను పార్టీ మారబోతోన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. తాను 1994 నుంచి రాజకీయాల్లో ఉన్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. నాటి నుంచి నేటి వరకు సుమారు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి విధేయతతో పనిచేసి, వరుసగా 6 సార్లు ఎన్నికల్లో గెలుపొందానన్నారు. తన భార్య పద్మావతి రెడ్డి (Padmavathi Reddy) గతంలో కోదాడ ఎమ్మెల్యేగా గెలుపొందారని, 2018 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైనట్లు ఉత్తమ్. ప్రస్తుతం పద్మావతి రెడ్డి(Padmavathi Reddy)పీసీసీ ఉపాధ్యక్షురాలుగా పార్టీ, ప్రజల కోసం చేస్తున్నారు. తమకు పిల్లలు లేరన్న ఉత్తమ్.. ప్రజలే తమ పిల్లలుగా భావించి వారికోసం అత్యున్నత స్థాయిలో నిరంతరం 24/7, 365 రోజులు పని చేస్తున్నాము. పలు మీడియా సంస్థలు గత 2 సంవత్సరాలుగా తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..నేను ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తను.. నా జీవితం కాంగ్రెస్కే అంకితం
తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై MP ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తనపై కొందరు కాంగ్రెస్ నాయకులే తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని బాంబు పేల్చారు. వారికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు తనను టార్గెట్ చేస్తున్నాయన్నారు. తాను 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్లు వెల్లడించారు. తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు
Translate this News: