దేశవ్యాప్తంగా ప్రస్తుతం నాగినేని కన్నయ్యనాయుడు పేరు మారుమోగిపోతోంది. ఎక్కడ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలు వచ్చినా ఈయన పేరే గుర్తుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన కన్నయ్యనాయుడు కర్ణాటకలో ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాలుపంచుకున్నారు. దేశంలో ఎదురైన ఎన్నో కఠినమైన సవాళ్లకు పరిష్కార మార్గాలు సూచించారు. 80 ఏళ్ల వయసులో కూడా అదే ఉత్సాహంతో యువ ఇంజనీర్లకు స్పూర్తినిస్తున్నారు. ఇటీవల కర్ణాటకలో తుంగభద్ర డ్యాం 19 వ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో టీఎంసీల కొద్దీ నీళ్లు దిగువకు వృథాగా పోతున్న సమయంలో.. ఆ నీటికి అడుకట్ట వేయడంలో కనయ్య నాయుడే కీలక పాత్ర పోషించారు. వారం రోజుల్లో గేట్కు ప్రత్యామ్నాయంగా స్టాప్లాగ్ గేట్లను అమర్చి సమస్యకు తాత్కాలిక పరిష్కారాన్ని చూపించారు.
పూర్తిగా చదవండి..Kannayya Naidu: మొన్న తుంగభద్ర, నేడు ప్రకాశం బ్యారేజ్ గేట్ల రిపేర్.. ఎవరీ కన్నయ్య నాయుడు?
ప్రస్తుతం నాగినేని కన్నయ్యనాయుడు పేరు మారుమోగిపోతోంది. కర్ణాటకలో తుంగభద్ర , ఇటీవల ప్రకాశం బ్యారేజ్ గేట్లను రిపేర్ చేసి ఈ డ్యామ్లను కాపాడటంలో ఈయనే కీలక పాత్ర పోషించారు. కన్నయ్యనాయుడి గురించి మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: