హైదరాబాదులో దారుణం.. మహిళను కారుతో ఢీ కొట్టి..!

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను కారుతో ఢీ కొట్టి హత్య చేసిన ఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలో జరిగింది. చంద్రమౌళి అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం నిందితుడు నేరుగా పోలీసులకు లొంగిపోయాడు.

హైదరాబాదులో దారుణం.. మహిళను కారుతో ఢీ కొట్టి..!
New Update

Hyderabad News : వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను కారుతో ఢీ కొట్టి హత్య చేసిన ఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. చంద్రమౌళి అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం.. రామాంతాపూర్ శ్రీనగర్ కాలనీకి చెందిన పెన్నం చంద్రమౌళి(47) నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఎస్ఎన్ఎస్ రియల్ ఎస్టేట్ డైరెక్టర్ గా ఆఫీస్ నిర్వహిస్తున్నాడు. అదే ఆఫీస్ లో రామాంతాపూర్ కు చెందిన కొమ్మవారి మంజుల (40) జాబ్ చేస్తోంది.

చంద్రమౌళికి ఆమెతో మూడేండ్లుగా వివాహేతర సంబంధం నడుస్తోంది. గత మూడు నెలల నుంచి మంజుల మరోవ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని చంద్రమౌళి అనుమానించాడు. అంతేకాకుండా ఆమె చంద్రమౌళి దగ్గర రూ.28 లక్షలు తీసుకొని అడిగితే ఇవ్వడం లేదని, దీంతో మంజులపై కక్ష పెంచుకున్న చంద్రమౌళి.. మద్యం తాగొచ్చి ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఉప్పల్ భగాయత్ కు ఆమెను తీసుకొచ్చి కారుతో ఢీ కొట్టి హత్య చేశాడు.

అనంతరం నిందితుడు నేరుగా ఉప్పల్ పీఎస్ లో లొంగిపోయాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మంజుల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

#hyderabad #uppal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి