రాజేంద్రనగర్‌లో భారీ ప్రమాదం.. బేకరీలో పేలిన సిలిండర్.. ఆరుగురు పరిస్థితి విషమం..

హైదరాబాద్ శివారులో రాజేంద్రనగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బేకరీలో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయ్యింది. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

New Update
gas cylinder blast: సికింద్రాబాద్‌లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌

Cylinder Blast : హైదరాబాద్(Hyderabad) శివారులోని రాజేంద్రనగర్‌లో భారీ అగ్న ప్రమాదం చోటు చేసుకుంది. బేకరీ కిచెన్‌లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, గ్యాస్ లీకైన సమయంలో బేకరీలో 40 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులను డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు.

Also Read:

రాష్ట్రాన్ని వణికిస్తోన్న చలి.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి..!

భూ సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు.. సీఎం రేవంత్ ఆదేశాలు..

Advertisment
తాజా కథనాలు