హైదరాబాద్ మెట్రో కారిడార్ విస్తరణకు సంబంధించి మెట్రో ఎండీ ఆగస్టు 1 (మంగళవారం)న బేగంపేట్ మెట్రో రైల్ భవన్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ నుంచి పటాన్చెరువు 29 కిలోమీటర్లు, తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు 8 కిలోమీటర్లు, ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు మెట్రో కారిడార్ విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పటాన్ చెరు నుంచి నార్సింగి వరకు 22 కి.మీ మేర మెట్రో కారిడార్, తుక్కుగూడ, బొంగుళూరు, పెద్ద అంబర్పేట వరకు 40 కిలోమీటర్లు మెట్రో కారిడార్ నిర్మించనున్నట్లు ఎండీ తెలిపారు.జేబీఎస్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మించనున్నట్లు NVS రెడ్డి తెలిపారు. అలాగే ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు మెట్రో రైలును విస్తరింపచేసి కోటి జనాభాకు సరిపడేలా నగరంలో మెట్రోను విస్తరించాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..ట్రాఫిక్ రహిత సిటీగా మార్చే దిశగా భాగ్యనగరంలో మెట్రో విస్తరణ: మెట్రో ఎండీ
రోజురోజుకు హైదరాబాద్ మహానగరం విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్లో మెట్రోను నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ విస్తరించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో విస్తరణకు సంబంధించి ఇప్పటికే రూ.69 కోట్లను కెటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడమే లక్ష్యంగా మెట్రో విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఎండీ తెలిపారు.
Translate this News: