ఆ అనుమానంతో భార్యను సజీవదహనం చేసిన దుర్మార్గుడు

మరొక పురుషుడితో సన్నిహితంగా ఉంటుందని భార్యను సజీవదహనం చేసిన భయంకరమై ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలి జిల్లాలో చోటుచేసుకుంది. అంజలి అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో శనివారం రాత్రి ఊరి పొలిమేరలోని ఓ గడ్డివాము దగ్గర బతికుండగానే కాల్చేశాడు నేపాలీ సింగ్‌.

New Update
ఆ అనుమానంతో  భార్యను సజీవదహనం చేసిన దుర్మార్గుడు

భర్త అనుమానమే ఓ ఇల్లాలి పాలిట శాపమైంది. నూరేళ్లు తోడుంటానంటూ పెళ్లినాడు ప్రమాణాలను చేసినవాడే ఆమెను సజీవదహనం చేశాడు. మరొక పురుషుడితో సన్నిహితంగా ఉంటుందనే క్షణాకావేశంలో అత్యంత దారుణంగా హతమార్చాడు. భార్య తప్పుడు పని చేస్తూ తన కంటపడిన చోటులోనే ఈ ఘోరానికి పాల్పడ్డట్లు తెలిపాడు. స్థానికులను భయాందోళనకు గురిచేసిన ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలి జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే బరేలీ పోలీసులు వెల్లడించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. నేపాలీ సింగ్‌ అనే వ్యక్తికి అంజలి (35) అనే మహిళతో కొంతకాలం క్రితం పెళ్లైంది. అయితే ఇన్నాళ్లు సాజావుగానే సాగిన సంసారంలో చిన్న చిన్న సమస్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని నేపాలీసింగ్ కు అనుమానం మొదలైంది. దీనిని మనసులో పెట్టుకుని రగిలిపోతున్న అతడు శనివారం రాత్రి ఊరి పొలిమేరలోని ఓ గడ్డివాము దగ్గర ఆమెను తీసుకెళ్లి సజీవదహనం చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు సగానికిపైగా కాలిపోయిన మృతదేహాన్ని బయటకి తీసి పోలీసులకు సమాచారం అందించారు.

Also read : వీర్య కణాలు తగ్గిపోవడానికి ఆ మందులే కారణం.. వెల్లడించిన వైద్యులు

ఈ క్రమంలో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. గడ్డివాము దగ్గర తన భార్యను వేరే వ్యక్తితో అభ్యంతరకర స్థితిలో చూశానని, అందుకే గడ్డివాముకు నిప్పుపెట్టానని నేపాలీ సింగ్‌ పోలీసులకు తెలిపాడు. అంజలి తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే నేపాలీ సింగ్ చెప్పింది నిజమేనా లేక ఇంకేవైన కారాణాలున్నాయా అనే కోణంలో కేసు పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు