వివాహ బంధం లోకి అడుగుపెట్టిన రాధ కూతురు కార్తీక!

నటి రాధ కూతురు కార్తీక ఆదివారం ఉదయం ఆమె ప్రియుడి తో ఏడడుగులు వేసింది. ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, సుహసిని, భాగ్యరాజ్‌, రేవతి తదితరులు హాజరయ్యారు.

వివాహ బంధం లోకి అడుగుపెట్టిన రాధ కూతురు కార్తీక!
New Update

తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు నటి రాధ. 80 దశకాలలో అగ్ర హీరోల సరసన ఆడిపాడిన నటి. ఆమె తరువాత తన వారసత్వాన్ని కొనసాగించడానికి తన ఇద్దరు కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసినప్పటికీ వారు రాధ అంతా బాగా రాణించలేకపోయారు. పెద్ద కూతురు కార్తీక జోష్‌ సినిమా ద్వారా 2009 లో నాగ చైతన్య హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.

సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ కార్తీక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా హిట్‌ కాలేదు. దాంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం అయ్యింది. ఆమె చివరిగా 2014లో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి అనే చిత్రంలో కనిపించారు. ఆ తరువాత 2017లో ఓ హిందీ సీరియల్‌ చేశారు.

తాజాగా కార్తీక వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆదివారం ఉదయం ఆమె ప్రియుడు రోహిత్‌ మీనన్‌ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి కేరళలో అత్యంత వేడుకగా జరిగింది. సినీ ఇండస్ట్రీ నుంచి చాలా మంది ప్రముఖ స్టార్లు ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, రాధిక, సుహాసిని, రేవతి, మేనక, భాగ్యరాజ్‌మరి కొందరు ఈ వివాహానికి హాజరు అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ గా మారాయి.

నటి రాధ ఈ పెళ్లికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్‌ చేశారు. కాగా కొంతకాలం క్రితం కార్తీక రోహిత్‌ మేనన్‌ ను పరిచయం చేసింది. ఆ ఎంగేజ్మెంట్ ఫొటోస్ షేర్ చేస్తూ.. “నిన్ను కలవడం అనేది విధి.. నిన్ను ఇష్టపడడం మ్యాజిక్.. మన జీవన ప్రయాణం మొదలుపెట్టడానికి కౌంట్డౌన్ ప్రారంభించా.. ” అంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన ప్రేమను వ్యక్తం చేశారు.

Also read: పేలవంగా భారత్ బ్యాటింగ్.. ధీనంగా చూస్తున్న విరాట్ కోహ్లీ..

#marrige #karthika #radha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe