Ratnam: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న విశాల్ రత్నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

హీరో విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ రత్నం. ఏప్రిల్ 26న థియేటర్స్ లో సందడి చేసిన ఈ చిత్రం .. ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. రత్నం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. మే 24 నుంచి స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం.

New Update
Ratnam: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న విశాల్ రత్నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

Hero Vishal Ratnam Movie OTT Release: సింగం ఫేమ్ హరి (Hari) దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ చిత్రం రత్నం. గతంలో హరి - విశాల్ కాంబినేషన్ లో భరణి (Bharani), పూజ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడవ సినిమా రత్నం పై భారీ అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగ్గట్లే ఏప్రిల్ 26 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలోని మాస్ యాక్షన్ , ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

రత్నం ఓటీటీ రిలీజ్

ఇప్పటివరకు థియేటర్స్ లో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందు సిద్ధమైంది. రత్నం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియో భారీ ధరకు దక్కించుకుంది. మే 24 నుంచి తమిళం, తెలుగు రెండు భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. అయితే రత్నం మూవీ ఓటీటీ హక్కులను మరో ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ కూడా కొనుగోలు చేసినట్లు చేసిందని టాక్. ఈ రెండింటిలోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో యంగ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా.. సముద్రఖని, యోగిబాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని కార్తేకేయన్ సంతానం, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. టాలీవుడ్ రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం అందించారు.

Also Read: Allu Arjun: జనసేనాని పవన్‌కు మద్దతుగా రంగంలోకి దిగిన అల్లు అర్జున్

Advertisment
తాజా కథనాలు