Prasanna Vadanam: ఓటీటీలో సుహాస్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఆ రోజే..?

యంగ్ హీరో సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ కలిసి నటించిన చిత్రం ‘ప్రసన్నవదనం’. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మే 24 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు.

Prasanna Vadanam: ఓటీటీలో సుహాస్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఆ రోజే..?
New Update

Prasanna Vadanam: యంగ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ప్రసన్న వదనం. వైకే అర్జున్ వైకే ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీస్ పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ కథానాయికలుగా నటించారు. లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా బ్యాన‌ర్‌పై మణికంఠ JS, ప్రసాద్ రెడ్డి TR సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ గా మే 3న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

Naga Babu : ట్విట్టర్ లోకి నాగబాబు రీ ఎంట్రీ.. అల్లు అర్జున్ ట్వీట్ పై ఏమన్నారంటే..? - Rtvlive.com

publive-image

ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్

అయితే విడుదలైన 20 రోజులకే ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రసన్న వదనం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో మే 24 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. ఆహా గోల్డెన్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి ఒక రోజు ముందుగానే అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Prabhas: ఆ హీరోయిన్ తోనే ప్రభాస్ పెళ్లి.. ఇదిగో ప్రూఫ్..! - Rtvlive.com

#ott #prasannavadanam-ott-release
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe